Nandigama Crime: నందిగామలో మహిళ దారుణ హత్య..! వెలుగులోకి సంచలన విషయాలు..
- నందిగామ నియోజకవర్గం ఐతవరంలో మహిళ దారుణ హత్య..
- పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama Crime: సంక్రాంతి పండుగ రోజుల్లో నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నాగేంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15న నాగేంద్రమ్మ ఇంట్లో హత్య జరిగింది.. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగేంద్రమ్మకు గతంలో వివాహం జరగగా.. భర్తతో విడిపోయింది. ఏడాదిన్నర నుంచి లారీ డ్రైవర్ హనుమంత రావుతో సహజీవనం సాగిస్తోంది. హనుమంత రావుకు గతంలో రెండు వివాహాలు అయ్యాయి. వారిద్దరితో విడిపోయి తాజాగా నాగేంద్రమ్మతో కలిసి హనుమంతరావు ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాదానికి కారణాలను పోలీసులు మరొకరితో నాగేంద్రమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవలు అవుతున్నట్టు గుర్తించారు.
Read Also: Congress: కర్ణాటక కాంగ్రెస్లో కోల్డ్వార్.. కేపీసీసీ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ!
Also Read
నాగేంద్రమ్మ కు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు.. నాగేంద్రమ్మను మాయమాటలు చెప్పి హనుమంతరావు సహ జీవనం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున తమతోనే ఉందని రాత్రి పూట ఏం జరిగిందో తెలియదు.. కనుమ పండుగ రోజున మధ్యాహ్నం ఇంట్లో శవమై కనిపించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్రమ్మను హనుమంతరావు తమ్ముడు అశోక్ కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఆశోక్ తో అక్రమం సంబంధం ఉందనే అనుమానంతో హనుమంతరావు హత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపిస్తున్నారు. హనుమంతరావు సోదరుడు అశోక్ తన తల్లి నాగేంద్రమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె కుమారుడు వారి అమ్మమ్మ బంధువులకు తెలియజేశారని వారు తెలిపారు. నాగేంద్రమ్మ కూడా గత కొంతకాలంగా అశోక్ అనే వ్యక్తి తనను మానసికంగా.. శారీరకంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు వద్దకు నాగేంద్రమ్మ వచ్చి చెప్పినట్టు చెబుతున్నారు.
Read Also: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
నాగేంద్రమ్మకు 14 సంవత్సరాల క్రితమే వివాహమైంది. భర్తతో విభేదించి సొంత ఊరు ఐతవరం వచ్చి నివసిస్తుండగా హనుమంతరావు పరిచయం అయ్యాడని ఆ పరిచయం కాస్త సహజీవనంగా మారింది. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన స్థితిలో నాగేంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించారు. నాగేంద్రమ్మ మెడపై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నాగేంద్రమ్మ హత్య కేసులో ఆమెతో సహజీవనం చేస్తున్న హనుమంతరావుని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. హనుమంతరావుతో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!