Nandigama Crime: నందిగామలో మహిళ దారుణ హత్య..! వెలుగులోకి సంచలన విషయాలు..
- నందిగామ నియోజకవర్గం ఐతవరంలో మహిళ దారుణ హత్య..
- పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama Crime: సంక్రాంతి పండుగ రోజుల్లో నందిగామ నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపింది. నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నాగేంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15న నాగేంద్రమ్మ ఇంట్లో హత్య జరిగింది.. దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగేంద్రమ్మకు గతంలో వివాహం జరగగా.. భర్తతో విడిపోయింది. ఏడాదిన్నర నుంచి లారీ డ్రైవర్ హనుమంత రావుతో సహజీవనం సాగిస్తోంది. హనుమంత రావుకు గతంలో రెండు వివాహాలు అయ్యాయి. వారిద్దరితో విడిపోయి తాజాగా నాగేంద్రమ్మతో కలిసి హనుమంతరావు ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాదానికి కారణాలను పోలీసులు మరొకరితో నాగేంద్రమ్మకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవలు అవుతున్నట్టు గుర్తించారు.
Read Also: Congress: కర్ణాటక కాంగ్రెస్లో కోల్డ్వార్.. కేపీసీసీ పోస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ!
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
నాగేంద్రమ్మ కు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు.. నాగేంద్రమ్మను మాయమాటలు చెప్పి హనుమంతరావు సహ జీవనం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున తమతోనే ఉందని రాత్రి పూట ఏం జరిగిందో తెలియదు.. కనుమ పండుగ రోజున మధ్యాహ్నం ఇంట్లో శవమై కనిపించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్రమ్మను హనుమంతరావు తమ్ముడు అశోక్ కూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఆశోక్ తో అక్రమం సంబంధం ఉందనే అనుమానంతో హనుమంతరావు హత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపిస్తున్నారు. హనుమంతరావు సోదరుడు అశోక్ తన తల్లి నాగేంద్రమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె కుమారుడు వారి అమ్మమ్మ బంధువులకు తెలియజేశారని వారు తెలిపారు. నాగేంద్రమ్మ కూడా గత కొంతకాలంగా అశోక్ అనే వ్యక్తి తనను మానసికంగా.. శారీరకంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు వద్దకు నాగేంద్రమ్మ వచ్చి చెప్పినట్టు చెబుతున్నారు.
Read Also: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
నాగేంద్రమ్మకు 14 సంవత్సరాల క్రితమే వివాహమైంది. భర్తతో విభేదించి సొంత ఊరు ఐతవరం వచ్చి నివసిస్తుండగా హనుమంతరావు పరిచయం అయ్యాడని ఆ పరిచయం కాస్త సహజీవనంగా మారింది. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన స్థితిలో నాగేంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించారు. నాగేంద్రమ్మ మెడపై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నాగేంద్రమ్మ హత్య కేసులో ఆమెతో సహజీవనం చేస్తున్న హనుమంతరావుని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. హనుమంతరావుతో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..