Madhya Pradesh: తప్పు చేసిన తల్లిని పీడకలల్లో వేధించిన కొడుకు.. చివరకు అసలు నిజం బయటపడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధాన్ని దాచిపెట్టేందుకు ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. మూడేళ్ల కన్న కొడుకును డాబాపై నుంచి తోసేసి చంపేసింది. తన నిర్వాకాన్ని చూసిన కొడుకు ఎక్కడ కానిస్టేబుల్ అయిన భర్తకు చెబుతాడో అని చంపేసింది. డాబా పైనుంచి పడటంతో తీవ్రగాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదవశాత్తు డాబా పైనుంచి పిల్లాడు పడిపోయి మరణించారని అనుకున్నారు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్న కొడుకును చంపేసిన తర్వాత, కొడుకు రోజూ పీడకల్లో కనిపిస్తూ వేధించడం ప్రారంభించాడు. దీంతో వీటిని తట్టుకోలేక సదరు తల్లి, భర్త ముందు తాను చేసిన దుర్మార్గాన్ని ఒప్పుకుంది. జ్యోతి రాథోడ్ అనే మహిళ తన పొరుగున ఉన్న వ్యక్తి ఉదయ్ ఇందౌలియా వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
Read Also: China: అలాంటి డ్రెస్సులు వేసుకుంటే జైలుకే.. కొత్త చట్టం చేస్తున్న చైనా
ఇదిలా ఉంటే జ్యోతి భర్త ధ్యాన్ చంద్ ఏప్రిల్ 28న తన ప్లాస్టిక్ దుకాణం ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి ఉదయ్ తో పాటు చుట్టుపక్కల వారిని ఆహ్వానించాడు. అయితే అదే సమయంలో జ్యోతి, ఉదయ్ ఇద్దరు డాబాపైకి వెళ్లారు. పిల్లాడు కూడా తల్లిని అనుసరిస్తూ డాబాపైకి వెళ్లాడు ఆ సమయంలో జ్యోతి, ఉదయ్ తో అసహజ స్థితిలో కనిపించింది. ఇది చూసిన పిల్లాడు తన తండ్రి ధ్యాన్ చంద్ కి చెబుతాడనే భయంతో పిల్లాడిని డాబా పై నుంచి కిందికి తోసి చంపేసింది. చికిత్స పొందుతూ పిల్లాడు ఏప్రిల్ 29న మరణించాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కన్నకొడుకు పీడకలల రూపంలో రావడంతో జ్యోతి తీవ్రంగా భయపడింది. దీంతో జ్యోతి తన భర్త ధ్యాన్ చంద్ కి అసలు విషయం చెప్పింది. ఆమె చెప్పిన నిజాన్ని భర్త రికార్డ్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో జ్యోతికి తన పొరుగువాడైన ఉదయ్ ఇందౌలియాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!