Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Wife Strangles Husband In Hyderabad After Affair Stages Suicide Drama Police Expose Murder Plot

Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..

Published Date :July 5, 2025 , 8:57 pm
By RAMAKRISHNA KENCHE
  • కంపిలి అంజిలప్పకు పదేళ్ల క్రితం రాధతో వివాహం
  • బతుకుదెరువు కోసం 2 నెలల క్రితం ముంబైకి వలస
  • అక్కడ ధన్వాడ యువకుడితో రాధకు పరిచయం
  • భార్య రాధను మందలించిన భర్త అంజిలప్ప
  • భర్త హెచ్చరించినా తీరుమార్చుకోని రాధ
  • ముంబై నుంచి సొంతూరికి పయనం
  • తాండూరు వరకు రాగానే రాధా కొత్త డ్రామా
  • మరెక్కడికైనా వెళ్దామని చెప్పిన రాధ
  • హైదరాబాద్‌కు వలస వచ్చిన అంజిలప్ప
  • బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో వాచ్‌మెన్‌‌గా పని
Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య..  చిన్న క్లూతో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా… ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?

READ MORE: Viral Video: ట్రెండింగ్‌లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?

భర్త అంటే.. భరించేవాడంటారు !! ఇదంతా గతం !! భర్త అంటే భార్య చేతిలో బలయ్యేవాడు.. !! ఇదే నేటి ట్రెండ్‌. కూరగాయలు తరిగినంత ఈజీగా భర్తలను చంపేస్తున్నారు భార్యలు. అది కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లను మించే రీతిలో మర్డర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అంతా చేసి తమకేం తెలియదన్నట్లుగా మహానటిని తలదన్నేలా నటిస్తున్నారు. తాజాగా… మరో భార్యామణి ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. ఆత్మహత్యగా నమ్మించి.. సినిమాటిక్‌ డ్రామా అల్లింది. కథ అడ్డం తిరిగి.. పోలీసులకు దొరికిపోయింది.

READ MORE: 100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్‌ లాంచ్

నారాయణపేట జిల్లా పరిధిలోని కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్పకు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం 2 నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. ముంబైలోనే పనిచేస్తున్న ధన్వాడకు చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వయసులో తనకంటే చిన్నవాడైనా… అతడితో ప్రేమాయణం సాగించింది రాధ. విషయం తెలుసుకున్న భర్త.. భార్య రాధను మందలించాడు. అయినా తీరు మారలేదు. పనులు మాని ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది..

READ MORE: Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?

భార్య తీరుతో విసుగెత్తిన అంజిలప్ప… అక్కడి నుంచి తట్టాబుట్టా సర్ధేసి… సొంతూరికి బయల్దేరాడు. తీరా ముంబై నుంచి తాండూరు వరకు చేరుకోగానే… కొత్త డ్రామా మొదలుపెట్టింది రాధ. ముంబై వచ్చిన రెండు నెలలు కూడా కాకముందే ఊరికి తిరిగెళ్లిపోతే… పని చేయడం చేతకాలేదని నలుగురూ నాలుగు మాటలంటారని… ఊరికి కాకుండా మరెక్కడికైనా వెళ్లిపోదామని భర్తకు చెప్పింది. దీంతో… అంజిలప్ప రూటు హైదరాబాద్‌ వైపు మళ్లింది. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో వాచ్‌మెన్‌ గా పనిలో చేరారు. స్థానికంగా ఉండే లేబర్‌ అడ్డాలో గుడిసె వేసుకుని ఉంటున్నారు.

READ MORE: Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి నాడు దయచేసి ఈ పనులు మాత్రం చేయకండి

ఊరు మారింది… చేసే పని మారింది… కానీ రాధ తీరు మారలేదు. ముంబైలో ఉన్న ప్రియుడితో నిత్యం కాల్స్‌ మాట్లాడటం మొదలుపెట్టింది రాధ. భర్త అంజిలప్ప గమనించాడు. మరోసారి రాధను హెచ్చరించాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్యా పలుమార్లు గొడవ జరిగింది. దీంతో… రాధ ఏకంగా భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్త హత్యకు స్కెచ్‌ వేసింది. గతనెల 23న మద్యం సేవించి ఇంటికి వచ్చాడు అంజిలప్ప. ఇదే అదునుగా భావించిన రాధ… ఆ రాత్రే భర్తను హతమార్చాలనుకుంది. మద్యం మత్తులో గాడ నిధ్రలో ఉన్న అంజిలప్ప గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది రాధ. భర్త చనిపోయాడు అని నిర్ధారించుకుని.. తనకేం తెలియనట్లు పక్కనే ఉన్న గుడిసెలో వెళ్లి పడుకుంది. తన భర్త తనను తీవ్రంగా కొట్టాడని.. అందుకే ఈ రాత్రి మీ గుడిసెలో పడుకుంటానని చెప్పింది. పక్క గుడిసెలో వాళ్లు కూడా… నిత్యం ఇద్దరి మధ్య జరిగే గొడవనే కాదా అని లైట్‌ తీసుకున్నారు..

READ MORE: Devendra Fadnavis: మరాఠీ కాదు, వారి బాధ రాజకీయం గురించి.. ఠాక్రే సోదరులపై ఫడ్నవీస్ ఫైర్..

తెల్లారగానే తన గుడిసెలోకి వెళ్లిన రాధ… కొత్త డ్రామా అల్లింది. తన భర్త ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడని గగ్గోలు పెట్టింది. స్థానికులు వచ్చి చూడగా… అంజిలప్ప చనిపోయాడని నిర్థారించారు. దీంతో.. ప్రైవేట్‌ అంబులెన్స్‌ తీసుకుని సొంతూరైన కోటకొండకు అంజిలప్ప మృతదేహం తీసుకుని వచ్చింది రాధ. తనతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడని అంజిలప్ప కుటుంబసభ్యులను నమ్మించింది రాధ. అంత్యక్రియలకు కూడా ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. కానీ.. అంజిలప్ప తమ్ముడికి వదిన తీరుపై అనుమానం వచ్చింది. అంజిలప్ప మృతదేహాన్ని పరిశీలించగా… గొంతుమీద గాయాలు గుర్తించాడు. వెంటనే నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోటకొండ చేరుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

READ MORE: Hypersonic missiles: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి… బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించిన బాచుపల్లి పోలీసులు… రాధను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తానే భర్తను గొంతునులిమి హత్య చేశానని ఒప్పుకుంది రాధ. హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు. రాధపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. తండ్రి హత్యకు గురయ్యాడు. తల్లి జైలు పాలైంది. దీంతో.. రాధ ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఇద్దరు పిల్లలను అమ్మమ్మకు అప్పగించారు పోలీసులు. భర్తను చంపితే నేరస్తురాలవుతుందనే చిన్న లాజిక్‌ను మర్చిపోయి.. ఇద్దరు పిల్లలను అనాథను చేసింది రాధ. అంతేకాదు.. పచ్చని తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anjilappa murder
  • Bachupally murder
  • children orphaned
  • crime thriller real life
  • Domestic violence

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?

  • SBI SCO Recruitment 2026: ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. శాలరీ ఎంతో తెలిస్తే వదులుకోరు

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జాతీయ జెండాను అవమానించాడంటూ ఆ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?

  • CM Revanth Reddy: ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లకు ప్రణాళిక‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions