Hypersonic missiles: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..
- ‘‘ప్రాజెక్టు విష్ణు’’ పేరుతో 12 హైపర్సోనిక్ మిస్సైళ్లు రెడీ చేస్తున్న భారత్..
- పాకిస్తాన్, చైనాలే టార్గెట్గా స్వదేశీ సాంకేతికతతో మిస్సైళ్లు..
- మాక్-8 వేగంతో లక్ష్యాలను ఛేదించే సత్తా..
- ఈ తరహా క్షిపణుల్ని ఆపడం దాదాపు కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘‘ప్రాజెక్టు విష్ణు’’పై పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ‘‘హైపర్ సోనిక్ మిస్సైల్స్’’ని డెవలప్ చేస్తోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇది మొత్తం ఆసియాలోనే పవర్ బ్యాలెన్స్ని ఛేంజ్ చేయగలదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ET-LDHCM వంటి క్షిపణులు మాక్ 8 (సుమారు గంటకు 10,000 కి.మీ.) వేగాన్ని తాకగలవు. దీంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న అమెరికా, రష్యా, చైనా జాబితాలో చేరుతుంది.
Also Read
- PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
Read Also: Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
ప్రాజెక్టు విష్ణు కింద డీఆర్డీఓ ఏకంగా 12 రకాల హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థల్ని తయారు చేస్తోంది. ఈ 12 మిస్సైల్స్ శత్రువుల క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డగించి నాశనం చేయడంతో పాటు శత్రువులపై అటాకింగ్ మిస్సైల్స్గా కూడా పనిచేస్తాయి. ఈ మిస్సైళ్లు ఇంటర్సెప్టర్ క్షిపణులుగా పనిచేస్తాయంటే, ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంటుందని అర్థం. డీఆర్డీఓ 2030 ముందే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్స్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధిక వేగం ఉన్న ఈ మిస్సైళ్లను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.
ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు- అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఈ సాంకేతికత ఉంది. భారత్ చేపట్టిన ప్రాజెక్టు కింద డెవలప్ చేస్తున్న మిస్సైల్స్ 1000 నుంచి 2000 కి.మీ బరువు ఉన్న సాంప్రదాయ లేదా అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
-
Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!