Gambling: జూదంలో భార్యను తాకట్టు పెట్టిన భర్త..
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి మహిళ అత్తామామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనికి తోడు బాధిత మహిళ భర్త జూదానికి అలవాటు పడి తరుచుగా డబ్బులు డిమాండ్ చేసే వాడు. జూదం కోసం రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒకసారి భర్తతో పాటు మహిళ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ భార్యను పణంగా పెట్టి జూదం ఆడి ఓడిపోయాడు. ఇక చేసేదేం లేక ఆమెను అక్కడి వదిలేసి సొంతూరు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఢిల్లీలో రక్షించాడు. అయితే ఇలా ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆరు నెలల క్రితం అత్తామామలు ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా భావించిన మరిది ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక మహిళ ఎస్పీ అనుపమ్ సింగ్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు 9 మందిపై వరకట్న వేధింపులు, దాడి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో