UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
- యూపీలో మరో దారుణం
- ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి సౌరబ్ను భార్య హత్య చేయగా.. తాజాగా ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపింది ఓ నవ వధువు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య జిల్లాకు చెందిన ప్రగతి యాదవ్(22)-అనురాగ్ యాదవ్ ప్రేమికులు. గత నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లిని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మార్చి 5న ప్రగతి యాదవ్కు దిలీప్ (25) అనే యువకుడితో బలవంతంగా వివాహం చేశారు. అయితే ఈ పెళ్లిని ప్రగతి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఇక ప్రియుడితో ఎడబాటును ఏ మాత్రం సహించలేకపోయింది. అంతే ప్రియుడు అనురాగ్ యాదవ్తో కలిసి కుట్ర పన్నింది. స్కెచ్లో భాగంగా దిలీప్ను చంపేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నారు.
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఇది కూడా చదవండి: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..
మార్చి 19న పొలంలో దిలీప్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చికిత్స కోసం బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో దిలీప్ను సైఫాయి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు తరలించారు. తిరిగి మార్చి 20న ఔరయ్యలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కరోజు అనంతరం దిలీప్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై దిలీప్ సోదరుడు సహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లయ్యాక.. ప్రగతి.. ప్రియుడిని కలుసుకోలేకపోవడంతో భర్తను చంపాలని నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. దిలీప్ను హత్య చేసేందుకు రామాజీ చౌదరిని కాంట్రాక్ట్ కిల్లర్గా నియమించుకున్నారని.. ఇందుకోసం రూ.2లక్షలు సుఫారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. రామాజీ.. మరికొందరితో కలిసి దిలీప్ను పొలాలకు తీసుకెళ్లి.. అక్కడ బాధితుడిని కొట్టి కాల్చేశారన్నారు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్సు, ఆధార్ కార్డు, రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇది కూడా చదవండి: MMTS Incident: ఎంఎంటీఎస్లో లైంగిక దాడికి యత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు…
తాజావార్తలు
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!