ఫ్రెండ్ భార్యతో రాసలీలలు.. వద్దని వారించినా వినకపోవడంతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిస్తే భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు. చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీంతో తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఇరుగుపొరుగువారు అనే మాటలు తట్టుకోలేక భార్య కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఐదేళ్ల చిన్నారిని అనాథను చేసిన విషాద ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని పిహెచ్ఈ కాలనీకి చెందిన గొల్లు బలన్, సాగర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. కొన్నేళ్ల క్రితం గొల్లు బలన్ కు సుధతో వివాహమైంది .. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తరువాత కూడా సాగర్ ఫ్రెండ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.. భార్యపైనా సెటైర్లు, జోకులు వేసేవాడు. ఇవేమి భర్త పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటు. కొద్దిరోజుల్లోనే భార్య, సాగర్ ల మధ్య స్నేహంవివాహేతర సంబంధానికి దారితీసింది. సుధ ప్రవర్తన గొల్లు బలన్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. తనను అనుమానిస్తే సాగర్ కి చెప్తానని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో తన భార్యను వదిలేయమని సాగర్ ని బతిమిలాడాడడు గొల్లు బలన్.. అయినా వారు మాట వినకపోవడంతో గత నెల గొల్లు బలన్, ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
అనంతరం చుట్టుపక్కల వారు తనవల్లే భర్త చనిపోయాడని అనే సూటిపోటి మాటలు భరించలేక సుధ సైతం పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని మృతిచెందింది. తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో ఐదేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. గొల్లు బలన్ తల్లి 70 ఏళ్ల వయసులో కష్టపడలేక, మనవడికి తిండిపెట్టలేక సతమతమవుతుంది. అద్దె కూడా కట్టని దయనీయ స్థితిలో ఉన్నానని, ఎవరైనా ఆదుకోవాలని ఆమె అడగడం చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. వివాహేతర సంబంధం ఇద్దరినీ రోడ్డుమీదకు లాగిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..