Medak Crime: దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..
- రామాయంపేటలోని కాట్రియాల గ్రామంలో దారుణం..
- ముత్తవ్వ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించిన గ్రామస్తులు..
- మంత్రాల నేపంతోనే దాడి జరిగినట్లు అనుమానం..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులు చేశారా లేదా అని నిర్దారించుకోకుండానే ప్రాణాలు తీస్తున్నారు. మంత్రాలు చేస్తుందనే నెపంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కత్రియాల గామంలో కలకలం రేపుతుంది.
Read also: TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
కత్రియాల గామంలో ద్యాగల ముత్తవ్వ తన కొడుకు, కోడలితో నివాసం ఉండేది. అయితే ఆమె రోజూ ఇంటింటికి వెళ్లి పలకరించేది. అయితే గ్రామస్తులు ముత్తవ్వపై అనుమానం పెంచుకున్నారు. ముత్తవ్వ ఇళ్ల ముందుకు వచ్చి ఏదో మంత్రాలు చేస్తుందని ఆమెను అనుమానించడం మొదలు పెట్టారు. అందుకే వారి ఇళ్లలో కీడు జరుగుతుందని ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఇలా ముగ్గురు తోడై ముత్తవ్వను చంపాలని ప్లాన్ వేసుకున్నారు. గురువారం అర్థరాత్రి ముత్తవ్వ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో ఉండగా మంత్రాలు చదువుతుందని అనుమానంతో వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె పై వేశారు.
ఆమె తేరుకునే లోపే నిప్పంటించారు. ఒక్కసారి మంటలు చెలరేగడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తమపై కూడా దాడి జరుగుతుందనే భయంతో కొడుకు, కోడలు అక్కడి నుంచి పరారయ్యారు. మహిళ కేకలు విన్న కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ముత్తవ్వ మృతి చెందింది. మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
PM Modi: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశం!
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..