Kidnap Case : కిడ్నాప్ కేసు 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు ..
- బాలిక మిస్సింగ్ సమాచారం అందుకున్న పోలీసులు
- రైల్వే పోలీసులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభం
- సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలన ద్వారా చిన్నారి స్థానం గుర్తింపు
- అరెస్ట్ అయిన బిచ్చగాళ్ల నుంచి తండ్రి కిడ్నాప్ నిజం వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap Case : కన్న తండ్రి కసాయిగా మారాడు. సొంత బిడ్డని ఏకంగా బిచ్చగాళ్లకు అమ్మేశాడు. బిచ్చగాళ్ళ మాఫియా పాపను కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఈలోగా తన పాప కిడ్నాప్ అయిందన్న తండ్రి డ్రామాతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు, రైల్వే పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. కేవలం 6 గంటల్లోనే పాప మిస్సింగ్ కేసును ఛేదించారు. ఇందుకోసం సీసీ పుటేజీలు అన్నీ పరిశీలించి.. మొత్తానికి పాపను పట్టుకున్నారు. చిన్నారిని తీసుకు వెళ్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు..
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు విషయం బయటపడింది. పాపను ఎత్తుకెళ్తున్న వారిని అరెస్ట్ చేయడంతో వాళ్లు నిజం చెప్పారు. చిన్నారి శ్రావణి తండ్రే 5 వేల రూపాయలకు విక్రయించాడని తెలిపారు. దీనిపై పాప తండ్రి మస్తాన్ను ప్రశ్నించారు పోలీసులు. అప్పుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. తన స్వస్థలం బాపట్ల జిల్లా వేటపాలెం అని చెప్పిన మస్తాన్.. మద్యం కోసం పాపను వాళ్లకు విక్రయించినట్లు వెల్లడించాడు…
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
భార్య గురించి అడిగిన పోలీసులకు ఆమెపైనా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. నిజానికి మస్తాన్ తన భార్యతో గొడవ పడి నాలుగు నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి శ్రావణిని బెజవాడకు తీసుకువచ్చాడు. అక్కడే కొద్ది కాలం నుంచి భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. ఈ క్రమంలో బొల్లా శ్రీనివాసరావు, చిన్నారి అనే బిచ్చగాళ్ల ముఠాతో పరిచయం ఏర్పడింది. దీంతో పాపను వారికి రూ. 5వేలకు విక్రయించాడు మస్తాన్ రావు. వారు రాజమండ్రికి బస్సులో వెళ్తుండగా గుర్తించిన పోలీసులు..బస్సు డ్రైవర్ సాయంతో వారిని పట్టుకున్నారు. దీంతో పాప కిడ్నాప్ కథ సుఖాంతమైంది…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!