Hyderabad Fraud: కిలాడీ లేడీ.. నమ్మితే నట్టేట ముంచింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fraud: సినిమాల్లో విలన్ తరహాలో ఓ కిలాడీ లేడీ.. తోటి మహిళలను చీటింగ్ చేసింది. తనకు 2 వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని నమ్మించింది. తన దగ్గర పెట్టుబడి పెట్టే డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మబలికింది. అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు. వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో రూ. 18 కోట్లు తీసుకుని ముఖం చాటేసింది. తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ పటాన్చెరులో జరిగింది.
READ ALSO: AP Fake Liquor Case: జనార్దన్ రావు అరెస్టు చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం!
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఆ మహిళ పేరు విద్య. ప్రస్తుతం పటాన్చెరులోని APR గ్రాండియాలో నివాసం ఉంటోంది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ.. ఏకంగా రూ.18 కోట్లు బురిడీ కొట్టేసిందంటే నమ్మగలరా? కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఈమె బాధితులు డబ్బులు అడిగిన పాపానికి ఇదిగో ఇలా.. స్ట్రెచర్ మీద పడి ఆస్పత్రి పాలయ్యారు.. విద్య గతంలో సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉండేది. ఆ సమయంలో చాలా మంది మహిళలను తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంది. ఏపీలో ఓ ఎమ్మెల్యేతో పరిచయాలు ఉన్నాయంటూ అందరినీ నమ్మించింది. ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి రూ. 2 వేల కోట్లు వస్తాయని చెప్పింది. అందుకోసం భారీ మొత్తంలో కంటైనర్స్ కొనుగోలు చేయాలని.. ఆ డబ్బు పెట్టుబడిగా పెడితే.. రెట్టింపు సొమ్ము ఇస్తానని నమ్మించింది..
అందరినీ గదిలో పెట్టి ఇనుప రాడ్లతో దాడి
పాపం ఇదంతా నమ్మిన ఆ మహిళలు పెట్టుబడుల రూపంలో విద్య దగ్గర డబ్బులు డిపాజిట్ చేశారు. తీరా డబ్బులు వసూలు చేసిన తర్వాత వారాసిగూడ నుంచి పటాన్చెరుకు మకాం మార్చింది విద్య. ఐతే మహిళలు అంతా డబ్బులు అడగడంతో అక్టోబర్ 9న ఇస్తానని చెప్పింది. అందర్నీ ఒకే చోటకు రప్పించింది. తీరా వచ్చాక…. అందరినీ గదిలో పెట్టి ఇనుప రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.. దాడి అనంతరం విద్యపై బాధితులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా దాడి చేసినపుడు ఫిర్యాదు చేస్తే పటాన్ చెరుపోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు…
READ ALSO: Weight Loss Discovery: ఊబకాయంతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!