Drugs : మరో పెద్ద నెట్వర్క్ను చేధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
- ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు
- హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం
- మరో పెద్ద మాఫియా గుట్టురట్టు
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్గా మారుస్తున్న గ్యాంగ్ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నార్కోటిక్స్ కేసులో రాచకొండ పోలీసులు పట్టుకున్న ఓ నైజీరియన్ను పట్టుకుని విచారించిన ఈగల్ టీమ్… తీగ లాగితే డొంక కదిలింది. విచారణలో సంచలన విషయాలు రాబట్టిన టీమ్… ఏకంగా నెట్వర్క్కు చెక్ పెట్టింది.
Read Also : Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
Also Read
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్ ఎసోమ్చీ కెనెత్ అలియాస్ మ్యాక్స్వెల్ అలియాస్ ఇమ్మాన్యుయెల్ బెడియాకోను ఈగల్ టీమ్కు అప్పగించారు రాచకొండ పోలీసులు. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ను విచారించిన ఈగల్ టీమ్.. కీలక విషయాలు రాబట్టింది. ఇతడు ఇచ్చిన సమాచారంతో ముంబై వెళ్లిన తెలంగాణ ఈగల్ ఫోర్స్.. సంచలన విషయాలు కనిపెట్టింది. డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దుర్గారం రతాజీ ప్రజాపతి అనే డ్రగ్ డీలర్… ముంబై కేంద్రంగా హవాలా నెట్వర్క్ నడుపుతున్నాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ సిటీల్లో హవాలా ఆఫీసులు ఏర్పాటు చేశాడు ప్రజాపతి. గోవా, ముంబై, ఢిల్లీలో ఉన్న ఏజెంట్లు… ఆయా సిటీల్లో ఉన్న నైజీరిఆయన్ డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బు సేకరించి హవాలా కేంద్రాలకు తరలిస్తారు. ఈ డబ్బు మొత్తాన్ని హవాలా రూపంలో నైజీరియాకు చేరవేస్తున్నాడు ప్రజాపతి. ఈ తతంగాన్ని అంతా గుర్తించిన తెలంగాణ ఈగల్ టీమ్.. హవాలా కేంద్రంపై రైడ్ చేసింది. ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు. హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఏజెంట్లు… డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బులు సేకరించి ముంబైలోని ప్రజాపతికి పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ డబ్బును హవాలాగా మార్చి.. పలు మార్గాల్లో నైజీరియా చేరవేస్తున్నాడు ప్రజాపతి…
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?