Drugs : మరో పెద్ద నెట్వర్క్ను చేధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
- ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు
- హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం
- మరో పెద్ద మాఫియా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్గా మారుస్తున్న గ్యాంగ్ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్పిన్ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నార్కోటిక్స్ కేసులో రాచకొండ పోలీసులు పట్టుకున్న ఓ నైజీరియన్ను పట్టుకుని విచారించిన ఈగల్ టీమ్… తీగ లాగితే డొంక కదిలింది. విచారణలో సంచలన విషయాలు రాబట్టిన టీమ్… ఏకంగా నెట్వర్క్కు చెక్ పెట్టింది.
Read Also : Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్ ఎసోమ్చీ కెనెత్ అలియాస్ మ్యాక్స్వెల్ అలియాస్ ఇమ్మాన్యుయెల్ బెడియాకోను ఈగల్ టీమ్కు అప్పగించారు రాచకొండ పోలీసులు. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ను విచారించిన ఈగల్ టీమ్.. కీలక విషయాలు రాబట్టింది. ఇతడు ఇచ్చిన సమాచారంతో ముంబై వెళ్లిన తెలంగాణ ఈగల్ ఫోర్స్.. సంచలన విషయాలు కనిపెట్టింది. డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దుర్గారం రతాజీ ప్రజాపతి అనే డ్రగ్ డీలర్… ముంబై కేంద్రంగా హవాలా నెట్వర్క్ నడుపుతున్నాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ సిటీల్లో హవాలా ఆఫీసులు ఏర్పాటు చేశాడు ప్రజాపతి. గోవా, ముంబై, ఢిల్లీలో ఉన్న ఏజెంట్లు… ఆయా సిటీల్లో ఉన్న నైజీరిఆయన్ డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బు సేకరించి హవాలా కేంద్రాలకు తరలిస్తారు. ఈ డబ్బు మొత్తాన్ని హవాలా రూపంలో నైజీరియాకు చేరవేస్తున్నాడు ప్రజాపతి. ఈ తతంగాన్ని అంతా గుర్తించిన తెలంగాణ ఈగల్ టీమ్.. హవాలా కేంద్రంపై రైడ్ చేసింది. ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్గా అదుపులోకి తీసుకున్నారు. హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఏజెంట్లు… డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బులు సేకరించి ముంబైలోని ప్రజాపతికి పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ డబ్బును హవాలాగా మార్చి.. పలు మార్గాల్లో నైజీరియా చేరవేస్తున్నాడు ప్రజాపతి…
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!