Murder: తల్లి అక్రమ సంబంధం.. తండ్రి హత్య.. పట్టించిన కొడుకు
- ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం
- భార్య అక్రమ సంబంధంతో భర్త హత్య
- ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించింది. మొదట్లో అందరూ ప్రమాదమని అనుకున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిజం బయటపడింది. దీంతో ఆటో డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: 3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ..
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం, హనుమంత్లాల్ తన భార్య పూజ పిల్లలతో కలిసి దేవా జాతరకు వెళ్లారు. అయితే జాతర నుండి తిరిగి వస్తుండగా, మృతుడు హనుమంత్లాల్ మోటార్ సైకిల్ పై ఉన్నాడు. ఆటో డ్రైవర్ అతన్ని రోడ్డుపై ఆపి ఇనుప రాడ్ తో కొట్టి చంపారు. ఆ తర్వాత వారు ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఈ-రిక్షా డ్రైవర్ తో కలిసి లక్నోకు తిరిగి వచ్చింది. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని భార్య పోలీసులకు చెప్పింది.
Read Also:Guntur Rape Case: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసు.. కామాంధుడి అరెస్ట్…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బారాబంకిలోని ఘుంఘేటర్ ప్రాంతంలో జరిగింది. పూజా గౌతమ్ అనే ఆ మహిళ మొదట్లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పింది. ఆమె పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు ఆమెను అనుమానించారు. కఠినంగా ఆమెను విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో పూజకు తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని తేలింది. ఇంట్లో వివాదాలు పెరగడంతో, ఆమె తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె లక్నోకు చెందిన ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ను కలిసింది. తన భర్తను చంపడానికి అతనికి లక్ష రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also:13 Years Boy: గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడిన బాలుడు.. చివరికి ఏమైందంటే?
మృతుడి బిడ్డ నిజాయితీ, పోలీసు బృందం సున్నితత్వం కారణంగా హత్య ఛేదించబడిందని ASP వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం, పూజ, కమలేష్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, మొబైల్ ఫోన్, ఈ-రిక్షా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ కు భార్య లక్ష రూపాయలు లంచం ఇచ్చిందని ఏఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!