Gaming addict: ఆన్లైన్ గేమింగ్కి బానిస.. అప్పు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చిన కసాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaming addict: ఆన్లైన్ గేమింగ్స్కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని హిమాన్షుగా గుర్తించారు. గేమింగ్లో నష్టాల కారణంగా అప్పులపాలు కావడంతో, వీటిని తీర్చేందుకు తన అత్త ఇంటి నుంచి నగలు దొంగిలించి, వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తల్లిదండ్రుల పేరుతో రూ.50 లక్షలకు జీవిత బీమా చేయించాడు. ఈ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు తల్లి ప్రభను చంపేశాడు. హిమాన్షు జూపీ అనే యాప్లో ఆన్లైన్ గేమింగ్కి బానిస అయినట్లు తేలింది. దీంతో రూ. 4 లక్షల వరకు అప్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చాలని స్నేహితుల నుంచి ఒత్తిడి రావడంతో తల్లిని చంపాడు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
Read Also: Ajit Pawar: 65 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు..
పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి రోషన్ సింగ్ చిత్రకూట్ ఆలయాన్ని సందర్శించేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో, హిమాన్షు తన తల్లి ప్రభ గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని జూట్ సంచిలో పెట్టుకుని, ట్రాక్టర్పై తీసుకెళ్లి యుమునా నది ఒడ్డున పారేశాడు. తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య, కొడుకు హిమాన్షు కనిపించలేదు. అయితే, నదికి సమీపంలో ట్రాక్టర్పై హిమాన్షను చూసినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పడంతో, ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 21న ప్రభ మృతదేహాన్ని వెలికితీసి, హిమాన్షును అరెస్టు చేశారు. అప్పులు తేర్చడానికి అతను వేసుకున్న ప్లాన్ గురించి పోలీసులకు వెల్లడించారు. తల్లిని అరెస్ట్ చేసిన తర్వాత పరారీలో ఉన్న హిమాన్షను పోలీసులు పట్టుకున్నారు. తన బంధువుల నగలు దొంగిలించిన విషయం తెలియడంతో తల్లి తిట్టాడని, అతడిని నగలు వెనక్కి ఇవ్వాలని చెప్పులతో కొట్టినట్లు, అందుకే తల్లిని హత్య చేసి అప్పులు తీర్చాయాలని అనుకున్నట్లు హిమాన్షు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!