Road Accidents: ఏపీలో మరో రెండు బస్సు ప్రమాదాలు, గుంటలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు, జనంపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..
- ఏపీలో మరో రెండు ప్రమాదాలు..
- పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంటలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు..
- అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accidents: పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాదు నుంచి బాపట్ల వెళ్లతున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదంలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుటలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణం పనులకోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పైప్ కు తగిలి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులున్నారు. అతివేగంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also:CM Revanth Reddy: అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
మరోవైపు, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటికుంటపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ బస్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను ఢీకొట్టి, అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమృత అనే మహిళ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాట్లాడుతూ, డ్రైవర్ మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తాటికుంటపల్లె నుంచి విద్యార్థులను రాయచోటి వైపు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..