Road Accidents: ఏపీలో మరో రెండు బస్సు ప్రమాదాలు, గుంటలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు, జనంపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..
- ఏపీలో మరో రెండు ప్రమాదాలు..
- పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంటలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు..
- అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accidents: పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాదు నుంచి బాపట్ల వెళ్లతున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదంలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుటలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణం పనులకోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పైప్ కు తగిలి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులున్నారు. అతివేగంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also:CM Revanth Reddy: అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
మరోవైపు, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటికుంటపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ బస్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను ఢీకొట్టి, అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమృత అనే మహిళ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాట్లాడుతూ, డ్రైవర్ మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తాటికుంటపల్లె నుంచి విద్యార్థులను రాయచోటి వైపు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!