RMP Murder Case: ఆర్ఎంపీ హత్య కేసులో ట్విస్ట్..! వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
- కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..
- హత్య చేసింది మేమేనని అంగీకరించిన వృద్ధదంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RMP Murder Case: కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
లీసులు చేపట్టిన విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి, బెలుం సింగవరంలోని గాలేరు నగరి కాలువ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గల పొలం వద్ద 70 ఏళ్ల వయసున్న దొనపాటి ఆనంద రెడ్డి, 65 ఏళ్ల వయసున్న మహేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.. అయితే, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్యను చంపింది మేమే నంటూ నిందితులు మీడియా ముందు అంగీకరించారు.. తమ కుమారుడు విశ్వనాథరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య కు ఫోన్ చేసి చికిత్స చేయాలంటూ ఇక్కడికి రప్పించి తలపై కర్రతో బలంగా కొట్టామని.. దీంతో.. అక్కడి కక్కడే కుప్ప కూలి పడిపోయి చనిపోయాడని తెలిపారు.. ఇక, చనిపోయిన కొండయ్య ను తమ కుమారుడే మోటర్ బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేసి నట్లు ఒప్పుకున్నారు. కొండయ్య, మెడ లో వేసుకున్న ఒక బంగారు గొలుసు తో పాటు, చేతిలో ఉన్న రెండు ఉంగరాల ను తామే తీసుకున్నట్లు చెప్పారు.. పోలీసులు తమను తీసుకెళ్లి విచారణ చేయడంతో అన్ని విషయాలు పోలీసులకు కూడా చెప్పామని, తాము తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. మృతుని భార్య వెంకటేశ్వరి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!