RMP Murder Case: ఆర్ఎంపీ హత్య కేసులో ట్విస్ట్..! వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
- కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..
- హత్య చేసింది మేమేనని అంగీకరించిన వృద్ధదంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RMP Murder Case: కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
లీసులు చేపట్టిన విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి, బెలుం సింగవరంలోని గాలేరు నగరి కాలువ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గల పొలం వద్ద 70 ఏళ్ల వయసున్న దొనపాటి ఆనంద రెడ్డి, 65 ఏళ్ల వయసున్న మహేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.. అయితే, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్యను చంపింది మేమే నంటూ నిందితులు మీడియా ముందు అంగీకరించారు.. తమ కుమారుడు విశ్వనాథరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య కు ఫోన్ చేసి చికిత్స చేయాలంటూ ఇక్కడికి రప్పించి తలపై కర్రతో బలంగా కొట్టామని.. దీంతో.. అక్కడి కక్కడే కుప్ప కూలి పడిపోయి చనిపోయాడని తెలిపారు.. ఇక, చనిపోయిన కొండయ్య ను తమ కుమారుడే మోటర్ బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేసి నట్లు ఒప్పుకున్నారు. కొండయ్య, మెడ లో వేసుకున్న ఒక బంగారు గొలుసు తో పాటు, చేతిలో ఉన్న రెండు ఉంగరాల ను తామే తీసుకున్నట్లు చెప్పారు.. పోలీసులు తమను తీసుకెళ్లి విచారణ చేయడంతో అన్ని విషయాలు పోలీసులకు కూడా చెప్పామని, తాము తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. మృతుని భార్య వెంకటేశ్వరి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!