RMP Murder Case: ఆర్ఎంపీ హత్య కేసులో ట్విస్ట్..! వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
- కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..
- హత్య చేసింది మేమేనని అంగీకరించిన వృద్ధదంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RMP Murder Case: కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
లీసులు చేపట్టిన విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి, బెలుం సింగవరంలోని గాలేరు నగరి కాలువ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గల పొలం వద్ద 70 ఏళ్ల వయసున్న దొనపాటి ఆనంద రెడ్డి, 65 ఏళ్ల వయసున్న మహేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.. అయితే, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్యను చంపింది మేమే నంటూ నిందితులు మీడియా ముందు అంగీకరించారు.. తమ కుమారుడు విశ్వనాథరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య కు ఫోన్ చేసి చికిత్స చేయాలంటూ ఇక్కడికి రప్పించి తలపై కర్రతో బలంగా కొట్టామని.. దీంతో.. అక్కడి కక్కడే కుప్ప కూలి పడిపోయి చనిపోయాడని తెలిపారు.. ఇక, చనిపోయిన కొండయ్య ను తమ కుమారుడే మోటర్ బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేసి నట్లు ఒప్పుకున్నారు. కొండయ్య, మెడ లో వేసుకున్న ఒక బంగారు గొలుసు తో పాటు, చేతిలో ఉన్న రెండు ఉంగరాల ను తామే తీసుకున్నట్లు చెప్పారు.. పోలీసులు తమను తీసుకెళ్లి విచారణ చేయడంతో అన్ని విషయాలు పోలీసులకు కూడా చెప్పామని, తాము తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. మృతుని భార్య వెంకటేశ్వరి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!