Uncles Murder Nephew: అల్లుడిని ఛాయ్ కి పిలిచి దారుణం.. ఏమైందంటే..
- ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య
- గొడ్డలితో నరికి చంపిన ముగ్గురు మేనమామలు
- ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడిని ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
పూర్తి వివరాల్లోకి వెళితే.. టోంక్ జిల్లాలోని బెల్హారి గ్రామంలో ముగ్గురు మామలు తమ మేనల్లుడు సురేష్ను ఒక భూ వివాదంపై టీ తాగించడానికి ప్రలోభపెట్టి, గొడ్డలితో దాడి చేసి చంపారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన 72 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుడు సురేష్ గుర్జార్ తన అన్నయ్య మన్రాజ్ తో కలిసి గ్రామంలో జరిగిన కమ్యూనిటీ విందుకు వెళ్తున్నాడు. దారిలో, అతని ముగ్గురు మామలు రామేశ్వర్, బాబులాల్, ఛోటు మహారాజ్, అతనిని ఛాయ్ తాగుదామని మాయ మాటలు చెప్పి అతడిని ఇంట్లోకి తీసుకెళ్లారు.సురేష్ లోపలికి రాగానే, ముగ్గురు మామలు, వారి కుమారుడు సోను, అతని భార్య లక్ష్మితో కలిసి గొడ్డలి, కర్రలతో అతనిపై దాడి చేసి.. ఆపై హత్య చేశారు.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి అన్న మన్రాజ్ ప్రభుత్వాన్ని కోరాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!