Uncles Murder Nephew: అల్లుడిని ఛాయ్ కి పిలిచి దారుణం.. ఏమైందంటే..
- ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య
- గొడ్డలితో నరికి చంపిన ముగ్గురు మేనమామలు
- ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడిని ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో..
Also Read
పూర్తి వివరాల్లోకి వెళితే.. టోంక్ జిల్లాలోని బెల్హారి గ్రామంలో ముగ్గురు మామలు తమ మేనల్లుడు సురేష్ను ఒక భూ వివాదంపై టీ తాగించడానికి ప్రలోభపెట్టి, గొడ్డలితో దాడి చేసి చంపారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన 72 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. నిందితులు పరారీలో ఉన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుడు సురేష్ గుర్జార్ తన అన్నయ్య మన్రాజ్ తో కలిసి గ్రామంలో జరిగిన కమ్యూనిటీ విందుకు వెళ్తున్నాడు. దారిలో, అతని ముగ్గురు మామలు రామేశ్వర్, బాబులాల్, ఛోటు మహారాజ్, అతనిని ఛాయ్ తాగుదామని మాయ మాటలు చెప్పి అతడిని ఇంట్లోకి తీసుకెళ్లారు.సురేష్ లోపలికి రాగానే, ముగ్గురు మామలు, వారి కుమారుడు సోను, అతని భార్య లక్ష్మితో కలిసి గొడ్డలి, కర్రలతో అతనిపై దాడి చేసి.. ఆపై హత్య చేశారు.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండడంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి అన్న మన్రాజ్ ప్రభుత్వాన్ని కోరాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!