ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్తకు తెలియడంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే ఈ హత్య చేసినట్లు నిర్దారించి వారిని అరెస్ట్ చేశారు.
వివరాలలోకి వెళితే.. భీమడోలు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడ్డిగూడం కూలీ పనులకు వెళ్లిన భార్య అక్కడ పనిచేసే పెంటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రోజు ఇంటి నుంచి పనికి వెళ్తున్నా అని చెప్పి ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. కొద్దిరోజులకు ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి, భర్త ప్రాణాలతో ఉంటే మనం కలవడం అసాధ్యమని తెలిపింది. దీంతో ఇద్దరు అతడిని హత్యచేయాలని ప్లాన్ వేశారు. ఇటీవల భర్తకు అనారోగ్యంగా ఉండడంతో తెలిసిన వ్యక్తిగా ప్రియుడు పెంటయ్య, ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్తను పలకరించాడు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
అక్టోబర్ 3 న హస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకురావడానికి అతనికి తోడుగా వెళ్లిన పెంటయ్య నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి, ప్రియురాలి భర్తను రాడ్డుతో కొట్టి చంపేశాడు. అనంతరం బైక్ ని కూడా ధ్వంసం చేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాడు. దెబ్బలు తనకు తగలకపోతే అనుమానమొస్తుందని పక్కనే ఉన్న గొయ్యిలో స్పృహ తప్పినట్లు నాటకమాడాడు. మొదట ఈ కేసును రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులకు భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో వారు లోతుగా ఈ కేసును విచారించగా గుట్టు బయటపడింది. ప్రియుడితో కలిసి ఉండాలని ఈ పని చేసినట్లు భార్య చెప్పగా, ప్రియురాలి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే వైఎస్ఆర్ భీమా పథకం కింద రూ. 5 లక్షలు వస్తాయని తెలియడంతో అతనిని చంపి, ఆ డబ్బుతో ప్రియురాలితో ఉండొచ్చని ఈ ప్లాన్ వేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!