MP News: రూ. 50వేలు ఇచ్చి.. కుమారుడిని హత్య చేయించిన తండ్రి..
- మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో దారుణం
- అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్య
- ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు
- కుమారుడిని హత్య చేయించిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్, జూదానికి ఇర్ఫాన్ అలవాటు పడటంతో తండ్రి ఇబ్బంది పడి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే.. గ్వాలియర్ జిల్లాలోని పాత కంటోన్మెంట్ నివాసి ఇర్ఫాన్ ఖాన్ అక్టోబర్ 21 న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు విచారించారు. అందులో భాగంగా ఇర్ఫాన్ తండ్రి హసన్ ను కూడా విచారించడంతో పోలీసులకు క్లూ లభించింది. హసన్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
READ MORE: Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
కుమారుడి చేష్టలకు తండ్రి మనస్తాపం..
హసన్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్ కి నేర చరిత్ర ఉంది. అతను జూదం, గంజాయికి కూడా బానిస. అతని విధ్వంసక అలవాట్ల కారణంగా కుటుంబంతో సంబంధాలు సరిగ్గాలేవు. దీంతో తరచూ గొడవలు జరిగేవి. కొడుకు వ్యసనం, అతని జీవితంపై చూపుతున్న ప్రతికూల ప్రభావంతో విసుగు చెందిన హసన్ ఖాన్ ఇర్ఫాన్ను చంపాలని ప్లాన్ చేశాడు. రూ. 50,000 కాంట్రాక్ట్ పిక్స్ చేసుకున్నాడు. అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ అనే ఇద్దరు కిరాయి హంతకులను హసన్ నియమించుకున్నాడు. అక్టోబర్ 21న, హసన్ ఇర్ఫాన్ను మభ్యపెట్టి, బదన్పురా-అక్బర్పూర్ కొండ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కాంట్రాక్ట్ కిల్లర్లు అతనిపై మెరుపుదాడి చేసి తల, ఛాతీపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
READ MORE:AP Govt: ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
హత్య తర్వాత, గ్వాలియర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అనుమానితులను విచారించి, సాక్ష్యాలను సేకరించారు. తర్వాత, వారు హసన్ ఖాన్పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన, అస్థిరమైన వాదనల కారణంగా పోలీసుల అనుమానం బలపడింది. తదుపరి విచారణలో.. హసన్ నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ని నియమించుకుని ఆకతాయిలు ఏర్పాటు చేసినట్లు అంగీకరించాడు. పరారీలో ఉన్నట్లు భావిస్తున్న అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!