MP News: రూ. 50వేలు ఇచ్చి.. కుమారుడిని హత్య చేయించిన తండ్రి..
- మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో దారుణం
- అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్య
- ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు
- కుమారుడిని హత్య చేయించిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో అక్టోబర్ 21న ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇర్ఫాన్ తండ్రి హసన్ ఖాన్ కాంట్రాక్ట్ ఇచ్చి తన కొడుకును చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్, జూదానికి ఇర్ఫాన్ అలవాటు పడటంతో తండ్రి ఇబ్బంది పడి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే.. గ్వాలియర్ జిల్లాలోని పాత కంటోన్మెంట్ నివాసి ఇర్ఫాన్ ఖాన్ అక్టోబర్ 21 న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు విచారించారు. అందులో భాగంగా ఇర్ఫాన్ తండ్రి హసన్ ను కూడా విచారించడంతో పోలీసులకు క్లూ లభించింది. హసన్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
READ MORE: Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
కుమారుడి చేష్టలకు తండ్రి మనస్తాపం..
హసన్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్ కి నేర చరిత్ర ఉంది. అతను జూదం, గంజాయికి కూడా బానిస. అతని విధ్వంసక అలవాట్ల కారణంగా కుటుంబంతో సంబంధాలు సరిగ్గాలేవు. దీంతో తరచూ గొడవలు జరిగేవి. కొడుకు వ్యసనం, అతని జీవితంపై చూపుతున్న ప్రతికూల ప్రభావంతో విసుగు చెందిన హసన్ ఖాన్ ఇర్ఫాన్ను చంపాలని ప్లాన్ చేశాడు. రూ. 50,000 కాంట్రాక్ట్ పిక్స్ చేసుకున్నాడు. అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ అనే ఇద్దరు కిరాయి హంతకులను హసన్ నియమించుకున్నాడు. అక్టోబర్ 21న, హసన్ ఇర్ఫాన్ను మభ్యపెట్టి, బదన్పురా-అక్బర్పూర్ కొండ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కాంట్రాక్ట్ కిల్లర్లు అతనిపై మెరుపుదాడి చేసి తల, ఛాతీపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
READ MORE:AP Govt: ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
హత్య తర్వాత, గ్వాలియర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అనుమానితులను విచారించి, సాక్ష్యాలను సేకరించారు. తర్వాత, వారు హసన్ ఖాన్పై అనుమానం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన, అస్థిరమైన వాదనల కారణంగా పోలీసుల అనుమానం బలపడింది. తదుపరి విచారణలో.. హసన్ నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ని నియమించుకుని ఆకతాయిలు ఏర్పాటు చేసినట్లు అంగీకరించాడు. పరారీలో ఉన్నట్లు భావిస్తున్న అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీమ్ సింగ్ పరిహార్ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?