Thailand: థాయ్లాండ్లో దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఓ హత్య విషయంలో విచారణ ప్రారంభించిన తర్వాత 32 ఏళ్ల గర్భిణి సరరత్ రంగ్సివుతాపోర్న్ను మంగళవారం బ్యాంకాక్లో అరెస్టు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆమె స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్వాంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఏప్రిల్ 14న నిందితురాలు రంగ్సివుతాపోర్న్ తన స్నేహితురాలి సిరిపోర్న్ తో కలిసి రచ్చబురి ప్రావిన్స్ కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నది వద్ద బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో సిరిపోర్న్ కుప్పకూలి చనిపోయింది. శవపరీక్షలో ఆమె శరీరంలో సైనైడ్ గుర్తించారు, గుండె ఆగిపోవడం మరణానికి దారితీసినట్లు తేలింది. ఈ హత్య తర్వాత ఆమె ఫోన్, డబ్బు, బ్యాగులు కనిపించకుండా పోయాయి.
Also Read
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
Read Also: Swetha Death Case Mystery: శ్వేత కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయం..!
విచారణ సందర్భంగా మాజీ ప్రియుడితో సహా 11 మందిని రంగసివుతాపోర్న్ హత్య చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా ఇదే తరహాలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తర్వాత బాధితుల నగదు మాయం అయినట్లు బంధువులు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. మరణించిన కొన్ని నెలల తర్వాత శవాలలో సైనైడ్ ను గుర్తించవచ్చు. సైనైడ్ విషప్రయోగం తర్వాత బాధితుడిని గుండె పోటుకు గురిచేస్తుంది, మైకం, శ్వాస ఆడకపోవడం, వాంతులు లక్షణాలతో బాధితుడు మరణిస్తాడు.
ఈ హత్యలకు డబ్బు కారణమని పరిశోధకులు భావిస్తున్నారని రాయల్ థాయ్ పోలీసు అధికార ప్రతినిధి ఆర్కేయోన్ క్రైథాంగ్ తెలిపారు. అయితే నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగ్సివుతాపోర్న్ ఆరోపణలను ఖండించారు. ఈ హత్యలో ఆధారాలు చూపితే అనుమానితురాలిని సీరియల్ కిల్లర్ గా అభివర్ణించ వచ్చని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!