దిశ కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది.
2019, నవంబర్ 27న జరిగిన దిశ అత్యా, హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్కు 50మీటర్ల దూరంలో నిందితులు ఓ యువతిని అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని తమ లారీలో షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
అయితే నిందితులను 2019, డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, అందుకే కాల్పులు జరిపినట్లు అప్పటి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్కౌంటర్లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ కోసం ఆర్నెళ్ల గడువు విధించింది.
త్రిసభ్య కమిషన్ విచారణ ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించిందిజ సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ… కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. విచారణలో భాగంగా దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ వివరాలు రాబట్టింది. అప్పటి కమిషనర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వున్న సజ్జనార్ కూడా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు… పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా సాగుతూనే వుంది. అయితే ఈ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన హైకోర్ట్ వాటిని కొట్టివేసింది. ఈ కమిషన్ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!