దిశ కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది.
2019, నవంబర్ 27న జరిగిన దిశ అత్యా, హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్కు 50మీటర్ల దూరంలో నిందితులు ఓ యువతిని అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని తమ లారీలో షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించారు.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
అయితే నిందితులను 2019, డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, అందుకే కాల్పులు జరిపినట్లు అప్పటి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్కౌంటర్లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ కోసం ఆర్నెళ్ల గడువు విధించింది.
త్రిసభ్య కమిషన్ విచారణ ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించిందిజ సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ… కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. విచారణలో భాగంగా దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ వివరాలు రాబట్టింది. అప్పటి కమిషనర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వున్న సజ్జనార్ కూడా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు… పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా సాగుతూనే వుంది. అయితే ఈ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన హైకోర్ట్ వాటిని కొట్టివేసింది. ఈ కమిషన్ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!