దిశ కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది.
2019, నవంబర్ 27న జరిగిన దిశ అత్యా, హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్కు 50మీటర్ల దూరంలో నిందితులు ఓ యువతిని అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని తమ లారీలో షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించారు.
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
అయితే నిందితులను 2019, డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, అందుకే కాల్పులు జరిపినట్లు అప్పటి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎన్కౌంటర్లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ కోసం ఆర్నెళ్ల గడువు విధించింది.
త్రిసభ్య కమిషన్ విచారణ ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించిందిజ సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ… కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. విచారణలో భాగంగా దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ వివరాలు రాబట్టింది. అప్పటి కమిషనర్, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా వున్న సజ్జనార్ కూడా కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు… పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా సాగుతూనే వుంది. అయితే ఈ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన హైకోర్ట్ వాటిని కొట్టివేసింది. ఈ కమిషన్ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!