Ahmedabad: మైనర్ బాలికని లేపుకెళ్లిన యువకుడు.. బాలిక కుటుంబం చేతిలో తల్లి హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad: పొరుగున ఉన్న మైనర్ అమ్మాయిని ఓ యువకుడు లేపుకుపోవడం ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. చివరకు యువకుడి తల్లి హత్యకు దారి తీసింది. అహ్మదాబాద్ లోని మన్సాలోని జరిగిన విషాద సంఘటనలో శిల్పా ఠాకూర్ అనే మహిళని కొట్టడంతో ఆమె చనిపోయింది. బాలిక తిరిగి వచ్చిన వారం తర్వాత ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Also: Tutankhamun: ఎట్టకేలకు ఈజిప్టు రాజు ‘‘టూటన్ఖామున్ శాపం’’ అసలు నిజాలు తెలిశాయి..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
మన్సాలోని రిధోల్ గ్రామానికి చెందిన మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల కిషన్ తమ ప్రాంతంలోని మైనర్ బాలికతో పారిపోయాడని ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలిక కుటుంబం కూడా ఏప్రిల్ 19న కిషన్పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కిషన్, సదరు మైనర్ బాలిక తమతమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తదనంతర పరిణామాల్లో ఠాకూర్ కుటుంబం తమ నివాసాన్ని తాత్కాలికంగా చరదాకు మార్చింది. శుక్రవారం బాలిక కుటుంబం, ఠాకూర్ ఫ్యామిలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. ఠాకూర్ కుటుంబంపై దాడి చేశారు. ఈ క్రమంలో గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించి శిల్పాఠాకూర్పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మహేష్ ఠాకూర్ తల్లి గాజీ ఠాకూర్, తండ్రి మోహన్ ఠాకూర్లకు కూడా గాయాలయ్యాయి. శిల్పా అక్కడికక్కడే మరణించగా.. గాజా, మోహన్ భాయ్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలిక కుటుంబంపై హత్యా నేరం నమోదు చేశారు. ఘటన తర్వాత నుంచి కుటుంబం పరారీలో ఉంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..