Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం..
- నిందితురాలు నిదా ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలుసు. ఉన్నతస్థానాల్లో ఉన్న ఉద్యోగులు మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితురాలు నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను నాసిక్ కోర్టు శనివారం తిరస్కరించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసర్ కోర్టులో హాజరయ్యారు. నిందితుల తరఫున న్యాయవాది రాహుల్ కస్లివాల్ తన వాదనలను వినిపించారు. ఏప్రిల్ 29న ఈ పిటిషన్పై విచారణ జరగగా, నేను కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
నాసిక్ టీసీఎస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి నిందితురాలు నిదాఖాన్ పరారీలో ఉన్నారు. ఏప్రిల్ 18న ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు బాధితుల్ని మతపరమైన ఆచారాలు పాటించేలా ప్రభావితం చేసేలా చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బాధితులకు హిజాబ్ ధరించడం, ఇస్లాంకు సంబంధించిన మత సూత్రాలను చెప్పడం వంటివి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసుకు మలేషియాతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
ఈ కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
తాజావార్తలు
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
-
China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
-
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
-
Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
-
Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!