Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య
- ప్రేమ వివాహం చేసుకున్న మూడేళ్లలోనే వివాహిత మృతి..
- భీమన అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య స్పందన..
- అమావాస్య తర్వాత రోజు ఉదయం మృతదేహమై కనిపించిన స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspicious Death: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంచెపాళ్యలో నివసిస్తున్న అభిషేక్, స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని అభిషేక్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇక, పెళ్లి తర్వాత స్పందనను కట్నం కోసం వేధించడం ప్రారంభించినట్లు సమాచారం. అత్తింటి వేధింపుల గురించి బాధపడుతూ స్పందన తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చేది. ఈ వ్యవహారంపై ఇరు కుటుంబాల పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరించి ఇటీవల రూ.5 లక్షలు కూడా ఇచ్చారు.
Read Also: PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
కానీ, గురువారం భీమన అమావాస్య సందర్భంగా భర్త అభిషేక్ కు పాదపూజ చేసిన స్పందన, ఆ మరుసటి రోజు శుక్రవారం ఉదయం మృతదేహమై కనిపించింది. ఈ విషాదవార్తను తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందన మృతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ కలిసి ఆమెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, ఈ హత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టే క్రమంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అత్తింటి వారిపై ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!