School Violence: బీహార్లోని గయా జిల్లాలో తమ కొడుకును కొట్టిన టీచర్పై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. ఆ విద్యార్థి పేరెంట్స్ స్కూల్ కి వచ్చి ఉపాధ్యాయుడిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. అయితే, వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టు కోవడంతో రాకేష్ అనే టీచర్ వారిని ఆపి ఇరువురిని చెంప దెబ్బలు కొట్టారు.
Read Also: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..
అయితే, అందులో ఒక స్టూడెంట్ తనను టీచర్ కొట్టిన విషయం పేరేంట్స్ కు ఫిర్యాదు చేయడంతో.. వారు కోపంతో క్షణాల్లోనే పాఠశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రాకేష్ పై పిడిగుద్దులు, చెంప దెబ్బలతో రెచ్చిపోయి దాడి చేశారు. అంతటితో ఆగకుండా కర్రలతో కూడా అతడ్ని తీవ్రంగా కొట్టారు. వారిని అడ్డుకోబోయిన మరో టీచర్ పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ భయంతో క్లాస్ రూమ్లోకి వెళ్లి దాకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. గాయపడిన సదరు ఉపాధ్యాయులు రాకేష్ రంజన్, ధర్మేంద్ర కుమార్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ये क्या है,आखिर सरकारी कर्मी कब तक असुरक्षित रहेंगे?@bihar_police संज्ञान लें👇
घटना गयाजी जिले के म० वि० शहवाजपुर खिजरसराय प्रखंड की है जहाँ एक छोटी सी बात के लिए परिजन टीचर को मारने-पीटने लगे। शिक्षक ने अपने स्कूल के बच्चों को होमवर्क ना करने पर सिर्फ सामान्य रूप में डाँटा था। pic.twitter.com/2pdXGqMpne— Teacher Info Point (@Teacher_Point) July 6, 2025