Karnataka: సెల్ఫోన్ చూడొద్దని తల్లి మందలింపు.. విద్యార్థిని ఏం చేసిందంటే..!
- సెల్ఫోన్ చూడొద్దని తల్లి మందలింపు
- డిగ్రీ విద్యార్థిని తీవ్ర నిర్ణయం.. కర్ణాటకలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి తరం పిల్లల తీరుపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నా.. భవిష్యత్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో అర్థాంతరంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్ మంచిగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎన్నో కలలు కంటారు. వారి కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. అంతేకాకుండా పెడదారిన పడుతుంటే సన్మార్గంలో పెడుతుంటారు. ఈ పరిణామంలో కొన్ని సార్లు సీరియస్ అవుతుంటారు. ఇదంతా కేవలం ప్రేమతోనే చేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ మధ్య పిల్లలను సెల్ఫోన్ అనే భూతం.. పిశాచిలా వెంటాడుతోంది. ఎప్పుడు చూసినా పిల్లలు మొబైల్కే అతుక్కుపోతున్నారు. ఈ పరిణామం చదువుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకోసమే మొబైల్కు దూరంగా ఉండాలని మందలిస్తుంటారు. ఈ ఘటనే ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఫోన్తో ఎక్కువ సేపు ఉండొద్దని కన్నతల్లి మందలించింది. అంతే కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని హరనహళ్లిలో జరిగింది.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
శివమొగ్గ సమీపంలోని హరనహళ్లికి చెందిన ధనుశ్రీ(20). బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఎక్కువ సేపు మొబైల్తోనే ఉంటుంది. దీంతో సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించమని తల్లి మందలించింది. అంతే ధనుశ్రీ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింంది. స్థానికులు హుటాహుటినా స్థానిక మెక్గాన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. అయితే పిల్లల మానసిక స్థితిపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో మెరుగైన కమ్యూనికేషన్ అవసరం అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..