Sons Kill Father: రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పోదటూరుపేటలో ఘటన..
- తండ్రి హత్యతో కొడుకుల ప్రవర్తనపై పోలీసులకు ఇన్సూరెన్స్ కంపెనీ ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు. అయితే, పోదటూరుపేటకు చెందిన గణేశన్కు ఇద్దరు కుమారులు మోహన్ రాజ్, హరి హరన్.. వీరిద్దరికి అప్పుల భారం పెరగడంతో పాటు విలాస జీవనానికి అలవాటు పడటంతో.. ఈజీ మనీ కోసం తండ్రినే టార్గెట్ చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే గణేశన్ పేరుతో భారీ మొత్తానికి బీమా చేయించి, ఆయనను హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించారు.
Read Also: India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?
Also Read
ఇక, తండ్రి మరణాన్ని సహజ ఘటనలా చూపించేందుకు పాము కాటు నాటకం ఆడారు ఇద్దరు కొడుకులు. మొదటిసారి తాచుపాముతో కాటు వేయించే ప్రయత్నం విఫలం కావ్వడంతో, మరోసారి ప్లాన్ మార్చారు. ఈసారి ఏకంగా తండ్రి గణేశన్ మెడకే తాచుపామును చుట్టి ప్రాణాలు తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, పాము కాటు ఘటన సమయంలో కొడుకుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సంబంధిత బీమా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు గణేశన్ను హత్య చేసిన అతని ఇద్దరు కుమారులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!