AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?
- ఈఎంఐ డబ్బులు చెల్లించలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వేధింపులు..
- న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు..
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: లోన్ యాప్ల వేధింపులు అంతా ఇంతా కాకుండా పోతున్నాయి.. లోన్ తీసుకోవాలంటూ వేధింపులు ఓవైపు.. మరోసారి లోన్ తీసుకున్న తర్వాత కట్టడం లేదంటూ మరో రకమైన టార్చర్.. ఆ లోన్ యాప్ల వేధింపులతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. మరెంతో మంది వేధింపులతో తీవ్రమైన మానసికక్షోభ అనుభవిస్తున్నారు.. అయితే, ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Manmohan Singh: 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నా, అందుకే ఏ రాజాని మంత్రిగా కొనసాగించా..
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్ యాప్లో లోన్ తీసుకుంది. ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎంత వారించినా ఏజెంట్లు వినకపోవడం, బెదిరింపులు పెరుగుతుండడంతో ఏజెంట్ల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు.. ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు సైబర్ నేరాలు.. లోన్ యాప్ బెదిరింపులపై అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.. ఇక, యువతిని వేధించిన ఫినబుల్ లోన్ యాప్పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ సుబ్బారాయుడు..
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..