Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..
- ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లి చూడగా షాక్..
- వృద్ధ దంపతులు.. వారి కుమార్తె అస్థిపంజరాలు లభ్యం..
- ఎలా మరణించారన్నది ఇప్పటికీ సస్పెన్స్..
- దర్యాప్తు చేసున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
Read Also: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
లోపల నుంచి లాక్ చేయబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాడా పోలీస్ స్టేషన్ అధికారి దత్తా కింద్రే తెలిపారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, డ్రాయింగ్ రూపంలో ఇద్దరు మహిళల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. బాత్రూంలో పురుషుడి అస్థిపంజరం కనిపించింది. ఈ అవశేషాలు 70 ఏళ్ల వృద్ధుడివి, అతని 65 ఏళ్ల భార్య మరియు 35 ఏళ్ల వారి కుమార్తెగా అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య, సమాచారాన్ని దాచడం మరియు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. వృద్ధ దంపతులు వారి వికలాంగురాలైన కుమార్తెతో అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. వీరి ఇద్దరు కుమారులు జిల్లాలోని వాసాయిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?