AP Crime: స్నేహితుడిని చంపి పాతి పెట్టాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన యువకుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. తన భార్యను తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో యువకుడిని హతమార్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె రూరల్ మండలం మాలెపాడు గ్రామం ఆవులపల్లెకు చెందిన ఆవుల నర్సింహులుకు, భార్య విజయలక్ష్మి, పిల్లలు యమున, త్రిష, హితేష్ ఉన్నారు. నర్సింహులు తాంత్రిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహులుకు కర్లమడుగు క్రాస్ గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఉంది. దీంతో తరచూ నర్సింహులు.. నాగరాజు ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య గంగాదేవిని నర్సింహులు తన తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. నాగరాజుకు విషయం తెలిసి ఆగ్రహించాడు. పలు మార్లు గొడవ పడ్డాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు.
Read Also: Congress: ‘‘ వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
Also Read
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
అయితే, నర్సింహులు తీరు మారలేదు. దీంతో ఎలాగైనా అతన్ని హతమార్చాలని పథకం పన్నాడు నాగరాజు. ముందస్తు పథకం ప్రకారం అక్టోబర్ 27న చంద్రగిరిలో తాంత్రిక వైద్యం చేయాలని ఆవుల నరసింహులును స్థానికంగా ఉంటున్న నారాయణస్వామి, కత్తి నరసింహులును మదనపల్లెలో బస్సు ఎక్కించి పంపించాడు. వాళ్లకు తెలియకుండా వెనక మరో బస్సు ఎక్కి శ్రీనివాసమంగాపురంలో నాగరాజు దిగాడు. నరసింగాపురంలోని మునిరాజకు ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం ఆవుల నరసింహులు ఒక్కడినే శ్రీనివాసమంగాపురానికి పిలిపించారు. ద్విచక్ర వాహనంలో అతడిని ఎక్కించుకుని.. నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మామిడి తోపులోకి నాగరాజు, మునిరాజు తీసుకెళ్లారు. అక్కడ కాళ్లు చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ అంటించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నాలుగు అడుగుల గొయ్యి తీసి పూడ్చి వేశారు. మరోవైపు ఆవుల నరసింహులు కనిపించడంలేదని అతని భార్య మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్నేహితులనూ విచారించగా.. నాగరాజ, మునిరాజు హత్య చేసినట్లు తెలిసింది. దీంతో మదనపల్లె పోలీసులు గురువారం నిందితులను తీసుకొచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!