AP Crime: స్నేహితుడిని చంపి పాతి పెట్టాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన యువకుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. తన భార్యను తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో యువకుడిని హతమార్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె రూరల్ మండలం మాలెపాడు గ్రామం ఆవులపల్లెకు చెందిన ఆవుల నర్సింహులుకు, భార్య విజయలక్ష్మి, పిల్లలు యమున, త్రిష, హితేష్ ఉన్నారు. నర్సింహులు తాంత్రిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహులుకు కర్లమడుగు క్రాస్ గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఉంది. దీంతో తరచూ నర్సింహులు.. నాగరాజు ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య గంగాదేవిని నర్సింహులు తన తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. నాగరాజుకు విషయం తెలిసి ఆగ్రహించాడు. పలు మార్లు గొడవ పడ్డాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు.
Read Also: Congress: ‘‘ వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
అయితే, నర్సింహులు తీరు మారలేదు. దీంతో ఎలాగైనా అతన్ని హతమార్చాలని పథకం పన్నాడు నాగరాజు. ముందస్తు పథకం ప్రకారం అక్టోబర్ 27న చంద్రగిరిలో తాంత్రిక వైద్యం చేయాలని ఆవుల నరసింహులును స్థానికంగా ఉంటున్న నారాయణస్వామి, కత్తి నరసింహులును మదనపల్లెలో బస్సు ఎక్కించి పంపించాడు. వాళ్లకు తెలియకుండా వెనక మరో బస్సు ఎక్కి శ్రీనివాసమంగాపురంలో నాగరాజు దిగాడు. నరసింగాపురంలోని మునిరాజకు ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం ఆవుల నరసింహులు ఒక్కడినే శ్రీనివాసమంగాపురానికి పిలిపించారు. ద్విచక్ర వాహనంలో అతడిని ఎక్కించుకుని.. నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మామిడి తోపులోకి నాగరాజు, మునిరాజు తీసుకెళ్లారు. అక్కడ కాళ్లు చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ అంటించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నాలుగు అడుగుల గొయ్యి తీసి పూడ్చి వేశారు. మరోవైపు ఆవుల నరసింహులు కనిపించడంలేదని అతని భార్య మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్నేహితులనూ విచారించగా.. నాగరాజ, మునిరాజు హత్య చేసినట్లు తెలిసింది. దీంతో మదనపల్లె పోలీసులు గురువారం నిందితులను తీసుకొచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!