Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- ప్రియుడి మోజులో పడి కాపురాలు కూల్చుకుంటున్న ఇళ్లాల్లు
- భార్య చేతిలో భర్త బలి
- సంగారెడ్డి జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర బంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం.. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం.. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఎన్నో వెలుగులోకి వస్తున్నా… కొంత మంది భార్యామణులు తీరు మార్చుకోవడం లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు.. అదే తరహాలో నేరం చేసి పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా భార్య చేతిలో భర్త బలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని పూడ్చేసింది ఆ ఇల్లాలు. పైగా ఏమి తెలియనట్టు పోలీసులకు తన భర్త కనిపించడం ఫిర్యాదు చేసింది. ఆమె తెలివికి పోలీసులే షాక్ అయ్యారు. కానీ చివరికి కాల్ డేటా ఆధారంగా బండారం బయటపడటంతో ప్రియుడితో కలిసి కటకటాల పాలయింది.
ఈవిడ పేరు కల్పన. కొన్నేళ్ల క్రితం ముత్యంరెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కల్పన నారాయణఖేడ్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం కల్పనకు గంగాపూర్ గ్రామానికి చెందిన పండరీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కల్పన, పండరీల మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇంట్లో తెలవకుండా కొన్ని రోజులు కల్పన మేనేజ్ చేసినా ఆ తర్వాత విషయం బయటపడింది. దీంతో కల్పన, ముత్యంరెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు ఆడ పిల్లలున్నారాని వివాహేతర సంబంధం కరెక్ట్ కాదని ముత్యంరెడ్డి పలు మార్లు భార్యను హెచ్చరించినా కల్పన తీరు మార్చుకోలేదు. ఈ మధ్య ఈ గొడవలు మరింత ఎక్కువ కావడంతో విషయం ప్రియుడు పండరికి చెప్పింది కల్పన..
Also Read
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ఇంకేముంది.. చాలా స్టోరీల్లోలాగానే.. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న ముత్యం రెడ్డిని వదిలించుకోవడానికి ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. కల్పన ప్లాన్కి ప్రియుడు పండరి ఒకే చెప్పడంతో వెంటనే తమ మాస్టర్ ప్లాన్ని అమల్లోకి తెచ్చారు. ఎలాగైనా ముత్యంరెడ్డిని చంపేయాలని అనుకున్నారు కాబట్టి… పండరీ పొలంలో జేసీబీతో హత్య చేశాక శవాన్ని పూడ్చడానికి ముందుగానే ఓ గుంత తవ్వారు…
ఇక వెంటనే మే 16న ఇదే విషయంలో మాట్లాడుదామని కల్పన భర్తకి ప్రియుడు పండరీ ఫోన్ చేశాడు. మనూర్ మండలం ఎల్గోయికి వస్తే ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పడంతో ఎల్గోయికి వెళ్లాడు ముత్యంరెడ్డి. అక్కడికి వెళ్లే సరికి భార్య కల్పన పండరీ దగ్గరే ఉండటంతో భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఇదే సమయంలో ముత్యంరెడ్డి, పండరీ మధ్య గొడవ జరిగింది. భార్య కల్పన, ప్రియుడు పండరీ ఇద్దరు కలిసి ముత్యంరెడ్డిని హత్య చేశారు. ముత్యంరెడ్డి చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పటికే తీసిన గుంతలో వేసి పూడ్చేశారు…
ఇంట్లో ఇద్దరు పిల్లలు నాన్న ఎటు వెళ్లాడు అని అడుగుతుంటే తనకి తెలియదని నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి. ఏమి ఎరగనట్టు మే 18న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదని కూతుర్లతో కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మొదట భార్యపైనే అనుమానం రాగా క్లారిటీ కోసం దర్యాప్తులో వేగం పెంచారు. అదే సమయంలో ముత్యంరెడ్డి, కల్పనల కాల్ హిస్టరీని పోలీసులు చెక్ చేశారు. కల్పన ఫోన్ నంబర్తో ఎక్కువసార్లు మాట్లాడినట్టు రికార్డ్ ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబర్ పండరీదిగా గుర్తించారు. వెంటనే పండరీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. మొదట తనకి ఏమి తెలియదని పండరీ చెప్పినా.. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేసేసరికి నేరం ఒప్పుకున్నాడు.
నిందితుడు పండరి చెప్పిన వివరాలతో వెంటనే భార్య కల్పనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కలిసి విచారించగా ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చి పెట్టామని చెప్పడంతో ఘటన స్థలానికి పోలీసులు తీసుకువెళ్లారు. హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టిన చోటు నుంచి ముత్యంరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి మనూర్ తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లడంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు. మొత్తంగా.. 9 రోజుల క్రితం అదృశ్యమైన ముత్యంరెడ్డి కేసు విషాదంగా ముగిసింది. భార్య వివాహేతర బంధానికి ముత్యం రెడ్డి బలయ్యాడు..
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!