Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- రిటైర్డ్ IPS అధికారి ఇంట్లో దారుణ హత్య
- పనిమనిషే మాస్టర్ ప్లాన్.. నేపాలీ గ్యాంగ్పై అనుమానం
- నగదు, బంగారం దోచుకుని పరారైన నిందితులు
- సీసీటీవీ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. దోపిడీ కోసమే పనిమనిషి తన గ్యాంగ్తో కలిసి ఈ మర్డర్కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం వినయ్ రంజన్ రాయ్ బెంగళూరులో ఉండగా, ఇంట్లో సునంద ఒక్కరే ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉంది. వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో గత 8 నెలలుగా కల్పన అనే నేపాలీ మహిళ పనిమనిషిగా ఉంటోంది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కల్పన, తన గ్యాంగ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి పక్కా స్కెచ్తో ఇంట్లోకి ప్రవేశించారు. సునందను చంపిన తర్వాత బ్యాగుల్లో భారీగా నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు కల్పనను కలిసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సునందను మర్డర్ చేసిన తర్వాత కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి కమిషనర్ సజ్జనార్ చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితులకు సంబంధించిన వీడియోలు , కోఆర్డినేషన్ డీటెయిల్స్ను పోలీసులు వాట్సప్ ద్వారా ఇతర టీమ్స్కు షేర్ చేశారు.
నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. నిందితుల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. నమ్మకంగా ఉంటూనే దోపిడీ కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సిటీలో పనిమనుషులను పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!