Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- రిటైర్డ్ IPS అధికారి ఇంట్లో దారుణ హత్య
- పనిమనిషే మాస్టర్ ప్లాన్.. నేపాలీ గ్యాంగ్పై అనుమానం
- నగదు, బంగారం దోచుకుని పరారైన నిందితులు
- సీసీటీవీ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. దోపిడీ కోసమే పనిమనిషి తన గ్యాంగ్తో కలిసి ఈ మర్డర్కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం వినయ్ రంజన్ రాయ్ బెంగళూరులో ఉండగా, ఇంట్లో సునంద ఒక్కరే ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉంది. వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో గత 8 నెలలుగా కల్పన అనే నేపాలీ మహిళ పనిమనిషిగా ఉంటోంది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కల్పన, తన గ్యాంగ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి పక్కా స్కెచ్తో ఇంట్లోకి ప్రవేశించారు. సునందను చంపిన తర్వాత బ్యాగుల్లో భారీగా నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు కల్పనను కలిసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సునందను మర్డర్ చేసిన తర్వాత కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి కమిషనర్ సజ్జనార్ చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితులకు సంబంధించిన వీడియోలు , కోఆర్డినేషన్ డీటెయిల్స్ను పోలీసులు వాట్సప్ ద్వారా ఇతర టీమ్స్కు షేర్ చేశారు.
నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. నిందితుల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. నమ్మకంగా ఉంటూనే దోపిడీ కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సిటీలో పనిమనుషులను పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!