Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- రిటైర్డ్ IPS అధికారి ఇంట్లో దారుణ హత్య
- పనిమనిషే మాస్టర్ ప్లాన్.. నేపాలీ గ్యాంగ్పై అనుమానం
- నగదు, బంగారం దోచుకుని పరారైన నిందితులు
- సీసీటీవీ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. దోపిడీ కోసమే పనిమనిషి తన గ్యాంగ్తో కలిసి ఈ మర్డర్కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం వినయ్ రంజన్ రాయ్ బెంగళూరులో ఉండగా, ఇంట్లో సునంద ఒక్కరే ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉంది. వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో గత 8 నెలలుగా కల్పన అనే నేపాలీ మహిళ పనిమనిషిగా ఉంటోంది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కల్పన, తన గ్యాంగ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి పక్కా స్కెచ్తో ఇంట్లోకి ప్రవేశించారు. సునందను చంపిన తర్వాత బ్యాగుల్లో భారీగా నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు కల్పనను కలిసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సునందను మర్డర్ చేసిన తర్వాత కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి కమిషనర్ సజ్జనార్ చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితులకు సంబంధించిన వీడియోలు , కోఆర్డినేషన్ డీటెయిల్స్ను పోలీసులు వాట్సప్ ద్వారా ఇతర టీమ్స్కు షేర్ చేశారు.
నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. నిందితుల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. నమ్మకంగా ఉంటూనే దోపిడీ కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సిటీలో పనిమనుషులను పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
-
Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
-
Balakrishna :”ఆనాడు అమ్మ అడిగిన ప్రశ్న వల్లే ఇది సాధ్యమైంది..”\
-
Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
-
Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!