Rajendranagar : మహిళ కిడ్నాప్ నుంచి హత్య వరకు షాకింగ్ ట్విస్ట్
- రాజేంద్రనగర్ మహిళ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో పురోగతి
- మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు
- అత్తాపూర్లో అపస్మారకస్థితిలో ఉన్న మహిళను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి
- కిస్మత్పురలోని నిర్మానుశ్యప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై దుర్గారెడ్డి అత్యాచారం
- అత్యాచారం తర్వాత మహిళను అత్తాపూర్కు తీసుకొచ్చి వదిలేసిన దుర్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar : హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చివరకు హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు అత్తాపూర్లో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను కిస్మత్పురలోని ఒక నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి రేప్కు పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తుమందు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Vidrohi : ఆసక్తికరంగా ‘విద్రోహి’ ట్రైలర్
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
రేప్ చేసిన అనంతరం మహిళను తిరిగి అత్తాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి పిల్లర్ నెంబర్ 340 వద్ద వదిలేసి దుర్గారెడ్డి వెళ్లిపోయాడు. దుర్గారెడ్డి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడ చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్ కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని మళ్లీ కిస్మత్పురలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్రేప్ చేశారు.
ఈ సమయంలో మహిళ సహకరించలేదన్న కారణంతో ఇమ్రాన్, దస్తగిరి ఆమెను కొట్టి హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె వంటిపైన ఉన్న దుస్తులను తొలగించారు. మృతురాలు పాత బస్తీకి చెందిన 30 ఏళ్ల మహిళ అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దుర్గారెడ్డి, దస్తగిరి, ఇమ్రాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపి, సాక్ష్యాధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!