EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
- ట్రాక్టర్ ఫైనాన్స్ డబ్బులు చెల్లించడానికి దారుణం..
- తల్లీకూతుళ్లను హత్య చేసిన సొంత బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EMI Crime: అప్పుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి EMI చెల్లించడానికి డబ్బులు లేవని సొంత బంధువులే దారుణహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. తల్లికూతుళ్లను సొంత బంధువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు హత్యకు పాల్పడ్డారు.
మే 28న జిల్లాలోని దేవ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతామాత అభయారణ్యంలోని భోపఖేడా పాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంకీ మీనా, ఆమె కుమార్తె కమల ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఆమె మరిది బాబులాల్ మీనా, అతడి భార్య గెండాబాయిలు కలిసి హత్య చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి మంకీ మీనా వెండి కంకణాలు, ఇతర ఆభరణాలు, నగదును దొంగిలించారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మేసి, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేద్దామని భావించారు.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్, సైబర్ టీమ్ సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. జూన్ 11న అటవీ ప్రాంతంలో నిందితుడు దాగి ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు బాబూలాల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడితో పాటు భార్య గెండాబాయిని కూడా అరెస్ట్ చేశారు.
నిందితుడు బాబూలాల్ ఇటీవల ఒక సెకండ్ హ్యాండ్ సోనాలిక ట్రాక్టర్ను రూ. 2.55 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో మంకీ మీనా వద్ద బంగారం, వెండి ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నేరం చేసిన తర్వాత కూడా ఇద్దరు నిందితులు మృతుల వద్ద దు:ఖిస్తూ నటించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, ఇతర వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!