Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- సోషల్ మీడియాలో జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో మోసాలు
- మొదట చిన్న ఫీజు.. తర్వాత లక్షల్లో డబ్బుల డిమాండ్
- ఫోటోలు, వ్యక్తిగత వివరాలతో బ్లాక్మెయిలింగ్కు తెగబడుతున్న కేటుగాళ్లు
- 1930కు వెంటనే కాల్ చేయండి.. సైబరాబాద్ డీసీపీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astro Scam : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp), ఫేస్బుక్ (Facebook) వంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్ములను వేదికగా చేసుకుని “ఆన్లైన్ జ్యోతిష్యం, తంత్ర పూజల” పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) టి. సాయి మనోహర్ తెలిపారు.
వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. “మీ వ్యక్తిగత సమస్యలకు తక్షణ పరిష్కారం”, “ధన ప్రాప్తి కోసం ప్రత్యేక శాంతి పూజలు”, “ఆర్థిక సమస్యల నివారణ”, “ప్రేమ వివాహం”, “వశీకరణ”, “బిజినెస్ గ్రోత్”, “కుటుంబ కలహాల పరిష్కారం” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు (Ads) ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
మొదట చిన్న మొత్తం.. ఆపై బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు
ఈ తరహా మోసాల్లో సైబర్ నేరగాళ్లు ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తారని డీసీపీ పేర్కొన్నారు. మొదట కేవలం చిన్న మొత్తంలోనే ఫీజు తీసుకుని సేవలు అందిస్తామని నమ్మబలుకుతారు. ఆ తర్వాత సమస్య తీవ్రతను చూపిస్తూ రకరకాల దోషాలు ఉన్నాయని, వాటి నివారణకు పెద్ద ఎత్తున పూజలు చేయాలంటూ విడతల వారీగా వేలల్లో, లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. బాధితులు ఒక దశలో మోసాన్ని గ్రహించి డబ్బులు పంపడం ఆపేసినా లేదా వారిని బ్లాక్ చేసినా.. అసలు కథ మొదలవుతుంది.
నేరగాళ్లు వేరే నంబర్ల నుండి వాట్సాప్ కాల్స్, మెసేజీల ద్వారా బాధితులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని, చేతబడి చేస్తామని బెదిరించడమే కాకుండా.. బాధితులు గతంలో పంచుకున్న వ్యక్తిగత ఫోటోలు, వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని బ్లాక్మెయిలింగ్కు దిగుతారు. ఈ మోసాల కోసం వీరు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, ఫేక్ ఫోటోలు, ఫేక్ రివ్యూలు , ఇతరుల పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలను (Mule Accounts) వాడుతుంటారు. కొన్నిసార్లు ఒకే గ్యాంగ్ విభిన్న పేర్లతో పదుల సంఖ్యలో అకౌంట్లు నడుపుతూ బాధితులపై తీవ్ర మానసిక ఒత్తిడిని తీసుకువస్తుందని పోలీసులు గుర్తించారు.
సైబర్ పోలీసులు ఇస్తున్న ముఖ్యమైన సూచనలు:
- ఆన్లైన్ బాబాలు, నకిలీ జ్యోతిష్యుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు క్రింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు..
- సోషల్ మీడియాలో కనిపించే ఆన్లైన్ జ్యోతిష్యం, తంత్ర, వశీకరణ , తక్షణ సమస్యల పరిష్కారం వంటి నకిలీ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు.
- ఇంటర్నెట్లో పరిచయమైన తెలియని వ్యక్తులకు, నకిలీ అకౌంట్లకు డబ్బులు పంపించే ముందు పూర్తి స్థాయిలో వారి వివరాలను ధృవీకరించుకోవాలి.
- మీ వ్యక్తిగత ఫోటోలు, సున్నితమైన సమాచారం లేదా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను అపరిచితులతో అస్సలు పంచుకోవద్దు.
- మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ఓటీపీలు (OTP) లేదా యూపీఐ పిన్ (UPI PIN) నంబర్లను ఎవరికీ చెప్పకూడదు.
- ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్ వేదికగా బెదిరింపులకు గురిచేస్తే భయపడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.
ఈ తరహా ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.cybercrime.gov.in లో తమ ఫిర్యాదును నమోదు చేయాలని డీసీపీ టి. సాయి మనోహర్ స్పష్టం చేశారు. తక్షణ పరిష్కారాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన పోస్టుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!