Crime News: తాగి వచ్చిన భర్తకు “తలకు మసాజ్” చేయనందుకు భార్య దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మద్యం తాగి వచ్చిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. పిల్లల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 63లో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాగి వచ్చిన హరేంద్ర గిరి(36) అనే వ్యక్తి, తనకు ‘‘తల మసాజ్’’ చేయాలని కోరాడు. అయితే భార్య రీను తాను వంట చేస్తున్నానని, కొంత సమయం తర్వాత చేస్తానని చెప్పడంతో కోపంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు.
వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది, ఐదు, రెండేళ్ల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయోధ్యకు చెందిన ఈ కుటుంబం సెక్టార్ 63లోని ఛజర్సి గ్రామంలో అద్దెకు ఉంటున్నారు. గిరి నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెక్టార్ 63 పోలీస్ స్టేషన్ అధికారి అవధేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 5 ఏళ్ల కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. హత్య సమయంలో రీను అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. వారు ఘటన స్థలానికి చేరుకునేసరికి రీనూ రక్తపుమడుగులో పడి ఉంది. తల్లి శవం పక్కనే కూతుళ్లు ఏడుస్తూ కనిపించారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Read Also: Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్కి స్పెషల్ ట్రీట్మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్పై సంచలన వ్యాఖ్యలు…
సోమవారం రాత్రి 10.30 గంటలకు గిరి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు. రీను వంట చేస్తున్నప్పుడు తలకు మసాజ్ చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి కొంత సమయం ఇవ్వాలని కోరడంతో ఇంట్లో ఉంచిన ఇటుకతో ఆమెను కొట్టి చంపేశాడు. పెద్ద కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, చిన్న కుమార్తె నిద్రపోతుందని, మరో కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని, ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
తలకు బలమైన కారణంగానే రీనూ మరణించిందని, అయితే పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తు్న్నామని పోలీసులు తెలిపారు. విచారణలో గిరికి తన ముగ్గురు కూతుళ్లు అంటే ఇష్టం లేదని, కొడుకు కోసం భార్యభర్తల మధ్య తరుచూ గొడవ జరిగేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!