Crime News: తాగి వచ్చిన భర్తకు “తలకు మసాజ్” చేయనందుకు భార్య దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మద్యం తాగి వచ్చిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. పిల్లల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 63లో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాగి వచ్చిన హరేంద్ర గిరి(36) అనే వ్యక్తి, తనకు ‘‘తల మసాజ్’’ చేయాలని కోరాడు. అయితే భార్య రీను తాను వంట చేస్తున్నానని, కొంత సమయం తర్వాత చేస్తానని చెప్పడంతో కోపంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు.
వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది, ఐదు, రెండేళ్ల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయోధ్యకు చెందిన ఈ కుటుంబం సెక్టార్ 63లోని ఛజర్సి గ్రామంలో అద్దెకు ఉంటున్నారు. గిరి నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెక్టార్ 63 పోలీస్ స్టేషన్ అధికారి అవధేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 5 ఏళ్ల కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. హత్య సమయంలో రీను అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. వారు ఘటన స్థలానికి చేరుకునేసరికి రీనూ రక్తపుమడుగులో పడి ఉంది. తల్లి శవం పక్కనే కూతుళ్లు ఏడుస్తూ కనిపించారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్కి స్పెషల్ ట్రీట్మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్పై సంచలన వ్యాఖ్యలు…
సోమవారం రాత్రి 10.30 గంటలకు గిరి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు. రీను వంట చేస్తున్నప్పుడు తలకు మసాజ్ చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి కొంత సమయం ఇవ్వాలని కోరడంతో ఇంట్లో ఉంచిన ఇటుకతో ఆమెను కొట్టి చంపేశాడు. పెద్ద కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, చిన్న కుమార్తె నిద్రపోతుందని, మరో కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని, ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
తలకు బలమైన కారణంగానే రీనూ మరణించిందని, అయితే పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తు్న్నామని పోలీసులు తెలిపారు. విచారణలో గిరికి తన ముగ్గురు కూతుళ్లు అంటే ఇష్టం లేదని, కొడుకు కోసం భార్యభర్తల మధ్య తరుచూ గొడవ జరిగేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..