Crime News: తాగి వచ్చిన భర్తకు “తలకు మసాజ్” చేయనందుకు భార్య దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మద్యం తాగి వచ్చిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. పిల్లల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 63లో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాగి వచ్చిన హరేంద్ర గిరి(36) అనే వ్యక్తి, తనకు ‘‘తల మసాజ్’’ చేయాలని కోరాడు. అయితే భార్య రీను తాను వంట చేస్తున్నానని, కొంత సమయం తర్వాత చేస్తానని చెప్పడంతో కోపంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు.
వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది, ఐదు, రెండేళ్ల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయోధ్యకు చెందిన ఈ కుటుంబం సెక్టార్ 63లోని ఛజర్సి గ్రామంలో అద్దెకు ఉంటున్నారు. గిరి నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని సెక్టార్ 63 పోలీస్ స్టేషన్ అధికారి అవధేష్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 5 ఏళ్ల కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. హత్య సమయంలో రీను అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. వారు ఘటన స్థలానికి చేరుకునేసరికి రీనూ రక్తపుమడుగులో పడి ఉంది. తల్లి శవం పక్కనే కూతుళ్లు ఏడుస్తూ కనిపించారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read Also: Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్కి స్పెషల్ ట్రీట్మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్పై సంచలన వ్యాఖ్యలు…
సోమవారం రాత్రి 10.30 గంటలకు గిరి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు. రీను వంట చేస్తున్నప్పుడు తలకు మసాజ్ చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి కొంత సమయం ఇవ్వాలని కోరడంతో ఇంట్లో ఉంచిన ఇటుకతో ఆమెను కొట్టి చంపేశాడు. పెద్ద కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, చిన్న కుమార్తె నిద్రపోతుందని, మరో కుమార్తె ముందే ఈ హత్య జరిగిందని, ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
తలకు బలమైన కారణంగానే రీనూ మరణించిందని, అయితే పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తు్న్నామని పోలీసులు తెలిపారు. విచారణలో గిరికి తన ముగ్గురు కూతుళ్లు అంటే ఇష్టం లేదని, కొడుకు కోసం భార్యభర్తల మధ్య తరుచూ గొడవ జరిగేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!