NZB MURDERS: కిరాతక హత్యలు..!!
- సీతాయిపల్లిలో రుక్మవ్వ అనే వృద్దురాలు మృతి
- రుక్మవ్వ తలపై బలమైన గాయం గుర్తించిన గ్రామస్తులు
- అత్తది సహజ మరణమేనని నమ్మించిన రెండో కోడలు
- బంగారు నగలు ఎలాగైనా కాజేయాలని పథకం
- బండరాయితో అత్త తలపై బాది హత్య
- బంగారు గుండ్లు, చెవి కమ్మలు తీసుకొని పరార్
- నిజమాబాద్లో మరో హత్య
- చెల్లితో మాట్లాడుతున్నాడని యువకుడి కక్ష
- గొడ్డలితో నరికి.. కత్తితో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZB MURDERS: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు హత్యలు కలకలం రేపాయి. అత్త బంగారు నగలపై కన్నేసిన ఓ కోడలు.. వాటి కోసం అత్తను కడతేర్చింది. అంతే కాదు సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే స్థానికులు గుర్తు పట్టడంతో అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు తన చెల్లితో మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన ఓ అన్న.. తాను పని చేసే ఓనర్ను హత్య చేశాడు. ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు హత్యలు జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ అనే వృద్దురాలు మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అంతా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ క్రమంలో రుక్మవ్వ.. ఆరోగ్యంగానే ఉండేది.. కానీ ఇలా ఎలా జరిగిందని చాలా మంది చర్చించుకున్నారు. ఓ వైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో గ్రామస్తులకు రుక్మవ్వ తలపై బలమైన గాయం కనిపించింది. దీంతో అనుమానించారు.
తలపై ఉన్న బలమైన గాయం చూస్తే.. సహజ మరణంగా కనిపించడం లేదనే విషయం అర్థమైంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కావటి రుక్మవ్వకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు మరణించగా చిన్న కుమారుడు భార్యా పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రుక్మవ్వ, ఇద్దరు కోడళ్లు సీతాయిపల్లి గ్రామంలోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఐతే పోలీసులు వచ్చే వరకు రుక్మవ్వ రెండో కోడలు కోటవ్వ.. తన అత్తది సహజ మరణమేనని నమ్మించింది. సీన్ కట్ చేస్తే.. పోలీసులు ఎంటరైన తర్వాత అసలు విషయం బయటపడింది.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
రెండో కోడలు కోటవ్వ, అత్త మధ్య కొంత కాలంగా గొడవలు జరగుతున్నాయి. అత్త దగ్గర ఉన్న బంగారు నగలు ఎలాగైనా కాజేయాలని పథకం వేసిన కోడలు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న రుక్మవ్వ ఇంట్లో చొరబడింది. బండరాయితో అత్త తలపై బాది హత్య చేసింది. అనంతరం రుక్మవ్వ మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు తీసుకొని వెళ్లిపోయింది. రుక్మవ్వ మృతి చెందటంతో.. గ్రామస్థులు బంధువులు మృతురాలి ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో కోడలు కోటవ్వ కూడా ఏమీ తెలియనట్లు వ్యవహరించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. బంగారం కోసం హత్య చేశానని ఆమె అంగీకరించింది. దీంతో కోటవ్వను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కాజేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్లో మరో హత్య
మరోవైపు నిజామాబాద్లో మరో హత్య జరిగింది. 6వ టౌన్ పరిధిలోని అక్బర్ బాగ్లో లారీ మెకానిక్గా పనిచేసే అక్షయ్ను అతని వద్ద పని చేసే కార్మికుడు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. అక్షయ్ ఇంట్లో చొరబడి.. గొడ్డలితో పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్బర్ బాగ్లో నివాసం ఉండే.. అక్షయ్ లారీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అతని ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తి అక్షయ్ వద్ద పని నేర్చుకుంటున్నాడు. అయితే కొద్ది రోజులుగా అక్షయ్ తన చెల్లి తో మాట్లాడుతున్నాడని సదరు యువకుడు కక్ష పెంచుకున్నాడు. మొన్న రాత్రి కూడా చార్జర్ కావాలంటూ ఆ యువతితో అక్షయ్ మాటామాటా కలిపాడు. ఆగ్రహంతో ఉన్న నిందితుడు.. రాత్రి అక్షయ్ ఇంట్లో చొరబడి.. గొడ్డలితో నరికి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!