Nellore : నెల్లూరులో మైథిలి మృతి వెనుక నిజం ఏమిటి.?
- నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబర్తి స్వస్థలం
- సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో నెల్లూరు వచ్చిన మైథిలి
- స్నేహితుడు నిఖిల్ పిలవడంతో అతని రూమ్కు వెళ్లిన మైథిలి
- ఇద్దరం గొడవ పడ్డాం మీ అక్కని చంపేశాను
- అని సాహితీకి చెప్పిన నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore : మాట్లాడాలి రూమ్కి రమ్మన్నాడు.. త్వరగా వెళ్లొచ్చులే అని నమ్మించాడు.. నమ్మి వెళ్లిన ఆ అమ్మాయిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. మీ అక్కని తీసుకెళ్లమంటూ ఆమె చెల్లికి ఫోన్ చేశాడు.. తానే కత్తితో పొడుచుకుని చనిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నెల్లూరులో జరిగిన మైథిలి ప్రియా హత్యలో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మైథిలి. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబర్తి స్వస్థలం. ఆమెకు 3 నెలల క్రితమే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఈ లోగానే ఇదిగో ఇలా మృతి చెందింది..
బెంగుళూరు వెళ్లి జాబ్లో చేరిన తర్వాత సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో ఈ నెల 3న నెల్లూరులోని చెల్లి రూమ్కి వచ్చింది. తోటి స్నేహితుడు నిఖిల్ పిలవడంతో అతన్ని కలిసేందుకు రూమ్కి వెళ్లింది మైథిలి. వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. దారుణంగా హత్యకు గురైంది. నిఖిల్ రూమ్ మెట్ల మీద మైథిలి మృతదేహం కనిపించింది. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కల్గించింది… నిఖిల్కు నర్సింగ్ కాలేజ్లో మైథిలి క్లాస్మేట్ నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మైథిలి ప్రియాను ఆమెతో సన్నిహితంగా ఉంటున్న నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. రాపూర్ మండలం చుట్టుపాలానికి చెందిన నిఖిల్కు నర్సింగ్ కాలేజ్లో మైథిలి క్లాస్మేట్. బీ ఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. నిఖిల్కి బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. వీరిద్దరూ కరెంట్ ఆఫీస్ సెంటర్లో రూమ్స్ తీసుకొని చదువుకున్నారు…
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
బెంగుళూరు నుంచి రాగానే మైథిలి స్నేహితులను కలిసింది. జాబ్ బాగుందని చెప్పింది. రాత్రి 11 సమయంలో ఆమె చెల్లి సాహితి ఫోన్ చేయగా.. ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్పింది. త్వరగానే వచ్చేస్తానని చెప్పింది. సుమారు 3 గంటల సమయంలో నిఖిల్ ఫోన్ నుంచి మైథిలి చెల్లెలు సాహితీకి ఫోన్ వచ్చింది. మీ అక్క రూమ్ దగ్గర ఉంది తీసుకెళ్లమంటూ అతను చెప్పాడు. దీంతో భయపడ్డ సాహితి వెంటనే నిఖిల్ రూమ్ వద్దకు వెళ్లింది. మెట్ల మీద మైథిలి ప్రియా మృతదేహాన్ని సాహితీ గుర్తించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఇద్దరం గొడవ పడ్డాం మీ అక్కని చంపేశాను.. అని నిఖిల్ చెప్పినట్లు సాహితి తెలిపింది. మైథిలినే పొడుచుకుని చనిపోయిందని నిఖిల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు…
రాత్రి మాట్లాడాలని రూమ్కి పిలిచి రూమ్లోనే మైథిలిని హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో మైథిలిని నిఖిల్ ప్రేమించాడు. అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు దూరంగా ఉంటున్నారు. ప్రేమ విషయం తెలిసి నిఖిల్ కి కౌన్సిలింగ్ ఇచ్చామని.. దూరంగా ఉంటానని చెప్పి.. తన కూతుర్ని నిఖిల్ చంపేశాడని మృతురాలి తల్లి లక్ష్మి తెలిపింది. మైథిలి, నిఖిల్.. బీ ఫార్మసీ మొదటి సంవత్సరం నుంచే స్నేహితులు. ఐతే ఆమెకు జాబ్ రావడంతో బెంగళూరు వెళ్లిపోయింది. నిఖిల్ నెల్లూరులోనే ఉంటున్నాడు. అయితే మైథిలిని ఎందుకు చంపాడనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. తనను దూరం పెడుతుందనే కోపంలో చంపాడా? లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల విచారణలో తెలాల్సి ఉంది….
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!