Nellore : నెల్లూరులో మైథిలి మృతి వెనుక నిజం ఏమిటి.?
- నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబర్తి స్వస్థలం
- సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో నెల్లూరు వచ్చిన మైథిలి
- స్నేహితుడు నిఖిల్ పిలవడంతో అతని రూమ్కు వెళ్లిన మైథిలి
- ఇద్దరం గొడవ పడ్డాం మీ అక్కని చంపేశాను
- అని సాహితీకి చెప్పిన నిఖిల్
Nellore : మాట్లాడాలి రూమ్కి రమ్మన్నాడు.. త్వరగా వెళ్లొచ్చులే అని నమ్మించాడు.. నమ్మి వెళ్లిన ఆ అమ్మాయిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. మీ అక్కని తీసుకెళ్లమంటూ ఆమె చెల్లికి ఫోన్ చేశాడు.. తానే కత్తితో పొడుచుకుని చనిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నెల్లూరులో జరిగిన మైథిలి ప్రియా హత్యలో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మైథిలి. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబర్తి స్వస్థలం. ఆమెకు 3 నెలల క్రితమే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఈ లోగానే ఇదిగో ఇలా మృతి చెందింది..
బెంగుళూరు వెళ్లి జాబ్లో చేరిన తర్వాత సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో ఈ నెల 3న నెల్లూరులోని చెల్లి రూమ్కి వచ్చింది. తోటి స్నేహితుడు నిఖిల్ పిలవడంతో అతన్ని కలిసేందుకు రూమ్కి వెళ్లింది మైథిలి. వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. దారుణంగా హత్యకు గురైంది. నిఖిల్ రూమ్ మెట్ల మీద మైథిలి మృతదేహం కనిపించింది. ఈ ఘటన నెల్లూరులో సంచలనం కల్గించింది… నిఖిల్కు నర్సింగ్ కాలేజ్లో మైథిలి క్లాస్మేట్ నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మైథిలి ప్రియాను ఆమెతో సన్నిహితంగా ఉంటున్న నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. రాపూర్ మండలం చుట్టుపాలానికి చెందిన నిఖిల్కు నర్సింగ్ కాలేజ్లో మైథిలి క్లాస్మేట్. బీ ఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. నిఖిల్కి బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. వీరిద్దరూ కరెంట్ ఆఫీస్ సెంటర్లో రూమ్స్ తీసుకొని చదువుకున్నారు…
Also Read
బెంగుళూరు నుంచి రాగానే మైథిలి స్నేహితులను కలిసింది. జాబ్ బాగుందని చెప్పింది. రాత్రి 11 సమయంలో ఆమె చెల్లి సాహితి ఫోన్ చేయగా.. ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్పింది. త్వరగానే వచ్చేస్తానని చెప్పింది. సుమారు 3 గంటల సమయంలో నిఖిల్ ఫోన్ నుంచి మైథిలి చెల్లెలు సాహితీకి ఫోన్ వచ్చింది. మీ అక్క రూమ్ దగ్గర ఉంది తీసుకెళ్లమంటూ అతను చెప్పాడు. దీంతో భయపడ్డ సాహితి వెంటనే నిఖిల్ రూమ్ వద్దకు వెళ్లింది. మెట్ల మీద మైథిలి ప్రియా మృతదేహాన్ని సాహితీ గుర్తించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఇద్దరం గొడవ పడ్డాం మీ అక్కని చంపేశాను.. అని నిఖిల్ చెప్పినట్లు సాహితి తెలిపింది. మైథిలినే పొడుచుకుని చనిపోయిందని నిఖిల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు…
రాత్రి మాట్లాడాలని రూమ్కి పిలిచి రూమ్లోనే మైథిలిని హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో మైథిలిని నిఖిల్ ప్రేమించాడు. అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు దూరంగా ఉంటున్నారు. ప్రేమ విషయం తెలిసి నిఖిల్ కి కౌన్సిలింగ్ ఇచ్చామని.. దూరంగా ఉంటానని చెప్పి.. తన కూతుర్ని నిఖిల్ చంపేశాడని మృతురాలి తల్లి లక్ష్మి తెలిపింది. మైథిలి, నిఖిల్.. బీ ఫార్మసీ మొదటి సంవత్సరం నుంచే స్నేహితులు. ఐతే ఆమెకు జాబ్ రావడంతో బెంగళూరు వెళ్లిపోయింది. నిఖిల్ నెల్లూరులోనే ఉంటున్నాడు. అయితే మైథిలిని ఎందుకు చంపాడనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. తనను దూరం పెడుతుందనే కోపంలో చంపాడా? లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల విచారణలో తెలాల్సి ఉంది….
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!