Telangana : భర్తను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటిని మరచి జల్సాలకు అలవాటు పడినా భర్తను భరించలేక సుఫారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించింది ఓ మహిళ.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..ఈ హత్య జరిగి నాలుగు రోజులు అయిన భార్య అసలు ధోషి అని తెలడంతో ఈ ఘటన వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..నల్గొండ పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ దగ్గర రఘురాములు అనే వ్యక్తి హత్య జరిగింది. అతడి హత్యకు భార్యే కారణమని తేలింది. దేవరకొండ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఈ దుకాణం బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. అటు ఉద్యోగం, ఇటు దుకాణం వదిలేసి రఘురాములు జల్సాలకు అలవాటుపడ్డాడు.. అప్పులు చేసుకుంటూ పోతున్నాడు.. తాగుడుకు బానిసగా మారడంతో భార్య దారుణనికి ఒడిగట్టింది…
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
భర్త ప్రవర్తన ఎప్పటికీ మారకపోవడంతో అతడిని అంతమొందించాలని భావించింది..హైదరాబాదులో ఉంటున్న స్నేహితురాలి భర్తతో పరిచయం పెంచుకుంది. భర్తను చంపడం కోసం అతడి సహాయం కావాలని కోరింది. దీనికోసం అతనితో ఇంస్టాగ్రామ్ కాల్ లో మాట్లాడేది. అలా చిలక రాజు అరుణ్ అనే అతనితో భర్తను చంపడం కోసం రూ.5 లక్షలకు సుపారి మాట్లాడుకుంది.. ప్లాన్ ప్రకారం మధ్యంలో నిద్ర మాత్రలు కలిపించింది..ఆ తర్వాత కదలకుండా చేసి రఘురాములు నోట్లో, ముక్కులో అరుణ్ సైనేడ్ పోశాడు. దీంతో రఘురాములు ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు పారిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో శ్రీలక్ష్మికి ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీ భర్తను హత్య చేశామని అరుణ్ చెప్పాడు. రఘురాములు హత్య విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!