Nalgonda Crime: మాయమాటలు చెప్పి బాలికను స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లిన కామాంధుడు.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి ఒక ఆటో, ఒక పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్లోకి ఆరేళ్ల చిన్నారి!
Also Read
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
మైనర్ బాలిక హత్య కేసులో కీలక నిందితుడు గడ్డం కృష్ణను.. మైనర్ బాలిక గ్రామానికే చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు కృష్ణ స్నేహితుడు మధుగా నిర్ధారించారు. సెప్టెంబర్ 7న అన్నారెడ్డిగూడెం నుంచి మైనర్ బాలిక నల్లగొండలోని ఓ ప్రయివేట్ ఇంటర్ కాలేజీకి బయల్దేరింది. కానీ ఆమెను మధ్యలోనే అటకాయించిన గడ్డం కృష్ణ.. తనకు ఉన్న పాత పరిచయంతో మాయ మాటలు చెప్పాడు. మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నేరుగా స్నేహితుడి రూమ్కు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితుడు మధును కూడా రమ్మని పిలిచాడు. నిందితులిద్దరూ కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అమ్మాయి చనిపోవడంతో భయాందోళనకు గురైన నిందితులు డెడ్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయారు.
Moringa Leaves Powder Benefits: సర్వ రోగ నివారిణిగా మునగాకు
మరోవైపు కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమకు తెలిసిన చోటల్లా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలించారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలు, పలు సాంకేతిక క్లూల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే నిందితులను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!