Minor Girl Assault : దత్తత పేరుతో దారుణం.. మైనర్ బాలికపై కేశినేని రమేష్ అత్యాచారం..
- మైనర్ బాలికను దత్తత తీసుకొని లైంగిక దాడి
- ఆంధ్రప్రదేశ్ లోని విస్సన్నపేటలో కేసు పెట్టిన తల్లి
- బలవంతంగా మైనర్ బాలికను ఖమ్మం తీసుకొని వచ్చిన కేశినేని రమేష్
- తమ కూతురిని తమకు అప్పగించాలని
- రమేష్ పై చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Assault : ఖమ్మం జిల్లాలో దత్తత పేరుతో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మానవత్వం సిగ్గుపడేలా, నమ్మకం పాతాళానికి పడిపోయేలా జరిగిన ఈ దారుణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విస్సన్నపేట గ్రామానికి చెందిన ముల్లంగి నాగుల్ మీరాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండవ కుమార్తె, 17 ఏళ్ల ముల్లంగి లావణ్యను దత్తత తీసుకోవాలని కేశినేని రమేష్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో ఆ బాలికను తన వద్దకు తీసుకెళ్లిన రమేష్, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో, రెండుసార్లు బాలికకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఈ దారుణం గురించి తెలుసుకున్న తల్లి నాగుల్ మీరా, విస్సన్నపేటలో రమేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబార్షన్ల విషయం బయటపడటంతో, తన కూతురిని ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. అయితే, రమేష్ అక్కడితో ఆగలేదు. లావణ్యను బలవంతంగా ఇంటి నుండి తీసుకెళ్లి ఖమ్మం నగరానికి తీసుకువచ్చాడు. ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ వివాదాన్ని ‘సెటిల్మెంట్’ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తమ కూతురిని తమకు తప్పకుండా అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేశారు.
కేశినేని రమేష్ వ్యవహారశైలిపై మరిన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికను కిడ్నాప్ చేసి రెండు రోజులు తన వద్ద ఉంచుకొని, ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణతో కలిసి ఖమ్మం పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కారులో మైనర్ బాలికను తరలిస్తుండగా, తల్లి నాగుల్ మీరా కారును ఆపి నిలదీశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి తల్లి, తమ కూతురిని తమకు అప్పగించాలని, కేశినేని రమేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!