Medipally Murder Case : మేడిపల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
- మేడిపల్లి హత్యకేసులో సంచలన విషయాలు
- మహేందర్రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు
- మహేందర్రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు
- గతంలో వికారాబాద్లో 498A కేసు కూడా నమోదైంది
- ఈ నెల 22న కూడా గొడవపడ్డారు
- స్వాతి గర్భవతి, మెడికల్ చెకప్కి తీసుకెళ్లమని అడిగింది
- ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది
- స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు.-డీసీపీ పద్మజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medipally Murder Case : హైదరాబాద్లోని మేడిపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భయంకర హత్య కేసు చుట్టూ ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి, ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీసీపీ పద్మజా మీడియాకు వివరాలు తెలిపారు. భార్య స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ రెడ్డికి అనుమానం మొదలైంది. మొదటి గర్భాన్ని తీయించాడు. రెండోసారి కూడా స్వాతి గర్భవతి కావడంతో, ఆ గర్భం తన వల్ల రాలేదని అనుమానించి తరచూ గొడవలు పెట్టేవాడు. స్వాతి పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్లో టెలికాలర్గా పని చేస్తుండగా, ఇంట్లో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుందనే కారణంతో కూడా అనుమానం పెంచుకున్నాడు.
Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన సీనియర్,జూనియర్ మెడికోలు
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
అయితే.. దంపతుల నడుమ తరుచూ గొడవులు జరుగుతుండేవి. ఈ నెల22న కూడా గొడవ జరిగింది. స్వాతి గర్భవతి, మెడికల్ చెకప్కి తీసుకెళ్లమని అడిగింది. ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది. ఈ కారణంగానే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు. బోడుప్పల్లో హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి, రాత్రి భార్యను గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, హాక్సా బ్లేడ్తో స్వాతి శరీరాన్ని ముక్కలు చేశాడు. తల, చేతులు, కాళ్లు వేర్వేరుగా ముక్కలు చేసి, మూడు కవర్లలో చుట్టి మూసీ నదిలో పడేశాడు. మూడు సార్లు వెళ్ళి శరీర భాగాలను పడేసిన తర్వాత, తన చెల్లికి ఫోన్ చేసి “నా భార్య మిస్సైంది” అని చెప్పాడు. దీంతో బావ గోవర్ధన్ రెడ్డి, మహేందర్ దగ్గరకు వచ్చాడు. అయితే.. మహేందర్ రెడ్డి ప్రణాళికబద్ధంగా హత్య చేసినట్లు తేలిందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పద్మజా చెప్పారు.
Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..
తాజావార్తలు
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!