Shocking : కూలీకి వెళ్లే మహిళలే టార్గెట్.. పని పేరుతో నమ్మించి కిరాతకంగా..
- కూలికి వెళ్లే మహిళలను టార్గెట్ చేసిన నిందితుడు
- ఈనెల 10న కోర్టుకు వచ్చిన మహిళను ట్రాప్ చేసి అత్యాచారం
- ఫకీర్ నాయక్ పై అత్యాచారం, హత్య కేసులు నమోదు
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన మహిళ హత్యాచారం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జిల్లా పోలీసులు నిందితుడిని ఫకీర్ నాయక్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫకీర్ నాయక్ ఈ నెల 10న కోర్టుకు హాజరుకావడానికి వచ్చిన ఒక మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఫకీర్ ముఖ్యంగా కూలికి వెళ్లే మహిళలని టార్గెట్ చేసుకుంటూ, పని పేరుతో నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి బెదిరించి అత్యాచారం చేసి, ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లేవాడని పోలీసులు పేర్కొన్నారు.
Also Read
పరిశీలనలో, ఫకీర్ నాయక్ పై ఇప్పటివరకు 7 కేసులు నమోదు కాగా, వీటిలో రెండు హత్యలు ఇదే విధంగా జరిగినట్లు గుర్తించారు. నిందితుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా అయితే, గత కొన్నేళ్లుగా సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడని పోలీసులు వివరించారు. మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
తాజావార్తలు
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
-
DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను