Maharashtra: దారుణం.. మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై క్లాస్మెట్స్ గ్యాంగ్రేప్
- మహారాష్ట్రలో దారుణం
- మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై క్లాస్మెట్స్ గ్యాంగ్రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దారుణం జరిగింది. వైద్య వృత్తికే కళంకం తెచ్చే దిగ్భ్రాంతి ఘటన జరిగింది. సహచర విద్యార్థినికి తోడుగా ఉండాల్సిన స్నేహితులే కాటేశారు. కామంతో కళ్లు నెత్తికెక్కిన విద్యార్థులు అఘాయిత్యాకి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి సహచర విద్యార్థినిపై ముగ్గురు వైద్య విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: NITI Aayog: నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. హాజరుకానున్న సీఎంలు
Also Read
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
కర్ణాటకలోని బెలగావికి చెందిన బాధితురాలు (22) మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ చదువుతోంది. మే 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు మగ వైద్య స్నేహితులతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంది. అయితే అందులో ఒకడు.. ఆమెను ప్లాట్కు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్నప్పుడు ఆమెకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోంచి బయటకు వచ్చాక.. జరిగిన ఘోరాన్ని ప్రశ్నించింది. అంతే ముగ్గురు నిందితులు ఆమెపై బెదిరింపులకు దిగారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.
ఇది కూడా చదవండి: NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
దీంతో చేసేదేమీలేక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారు విశ్రాంగ్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. దీంతో పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం.. మే 27 వరకు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించిందని ఒక అధికారి తెలిపారు. నిందితులంతా 20-22 ఏళ్ల వయసు వారిని పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా.. బాధితురాలి క్లాస్మేట్సేనని చెప్పారు. పూణె, షోలాపూర్, సాంగ్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని చెప్పారు. ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆమెకు మద్యం తాగించారని.. ఆమె మత్తులోకి జారుకున్నాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్రేప్ చేసినట్లుగా వెల్లడించారు. లైంగిక దాడి గురించి చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిందితులు బెదిరించారని అధికారి తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!