Delhi: పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ చేసిందని, సోషల్ మీడియాలో మహిళ ఫోటోలు
Delhi: తనను పెళ్లి చేసుకునేందుకు నో చెప్పిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆమె ఫోటోలతో నకిలీ సోషల్ మీడియా ఖతాలను క్రియేట్ చేసి, అవమానకరమైన పోస్టులు పెడుతూ, కించపరిచేలా కామెంట్స్ చేస్తూ వేధించాడు. చివరకు ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల మహిళ చిత్రాలను పోస్ట్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి శనివారం తెలిపారు. ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా సైబర్ నార్త్ పోలీస్ స్టేషన్కి అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 2018లో ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతడితో చాట్ చేయడం ప్రారంభించానని, అయితే కాలక్రమేణా, సదరు వ్యక్తి తనను వేధించడంతో పాటు మతాంతర వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
Read Also: Bihar: బీహార్లో దారుణం.. కళ్లలో కారం చల్లి, కత్తులతో పొడిచి దారుణహత్య..
బాధితురాలు అతనితో మాట్లాడటం మానేసినప్పటికీ.. నిందితుడు ఆమె ఫోటోలను ఉపయోగించి రెండు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలతో కొన్ని అభ్యంతరకమైన విషయాలను పోస్ట్ చేశాడు. మహిళకు మొబైల్ నెంబర్ని కూడా షేర్ చేశారు. ఇలా చేయడంతో సదరు మహిళ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని డీసీసీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. నిందితుడు గోపాల్ కరాలియను సోమవారం పూణేలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కరాలియాకు 2018లో బాధిత మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమెతో స్నేహం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకోవాలని అడిగాడని, అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో అది కుదరలేదని పోలీసులు తెలిపారు. నిందితుడి పెళ్లి ప్రపోజల్ని తిరస్కరించడంతోనే, ఆమె పరువు తీసేందుకు నిందితుడు అవమానకరమైన పోస్టులు పెట్టడం ప్రారంభించినట్లు డీసీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!