Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
- భార్యను తన నుంచి విడదీశారనే కోపం..
- అత్తమామల్ని చంపేందుకు ఆన్లైన్లో బాంబుల తయారీ..
- బాంబు పేలడంతో ఇద్దరి గాయాలు..
- నిందితులను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: అహ్మదాబాద్లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.
నిందితుల నుంచి మరో రెండు బాంబులు, కంట్రీమేడ్ పిస్టర్, క్యాట్రిడ్జ్లు, ఆయుధాల తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపన్ రావు భార్య విడాకులు తీసుకుంటోంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో ఉంది. సుఖాడియా తనకు, తన భార్యకు మధ్య విభేదాలు సృష్టించి తనకు, తన పిల్లలకు దూరం చేసిందని రూపర్ రావు నమ్మాడు. తన భార్య, అత్తమామలు, బావమరిది కడుపునొప్పి కారణంగా తాను బలహీనపరిచారని నిందితుడు భావించినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Zia Ur Rehman Barq: విద్యుత్ దొంగతనం.. సమాజ్వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..
నిందితుడు సుఖాదియా, అతని అత్తమామలను చంపడానికి, తన భార్యను ఆమె కుటుంబ నుంచి వేరు చేయడానికి, ఆమెను ఒంటరి చేయడానికి మూడు నాలుగు నెలల్లో ఇంటర్నెల్లో చూసి బాంబులు, ఆయుధాల తయారీని నేర్చుకోవడం ప్రారంభించినట్లు విచారణ తేలింది. రూపన్ రావుతో పాటు సహ నిందితులు సల్ఫర్ పౌడర్, బ్లేడ్లు, బ్యాటరీలు, బొగ్గు, బాణాసంచా నుంచి గన్పౌడర్ వంటి పదార్థాలను ఉపయోగించి రిమోట్ కంట్రోల్డ్ బాంబులను తయారు చేసిన కుట్ర పన్నారు.
రూపన్ రావుకి రోహన్ రావల్(21), గౌరవ్ గాధవి సహకరించాడు. శుక్రవారం రాత్రి సుఖాడియా ఇంటికి రావల్ మొదట బాంబు ఉన్న పార్సిల్ని తీసుకెళ్లాడు. అయితే, వారి టార్గెట్ ఇంట్లో లేకపోవడంతో పార్సిల్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ మరుసటి రోజు పార్సిట్ డెలివరీ చేయడానికి గాధమిని పంపించారు. రావల్ వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చారు. రూపన్ రావు తన అత్తమామల్ని, బావమరిదిని కూడా ఇదే విధంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు.
పేలుడు ఘటన తర్వాత గాధవిని స్పాట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వెంబడిస్తున్నప్పుడు, పోలీసులు ఒక కారు నుంచి రెండు లైవ్ బాంబుల్ని కనుగొన్నారు. వాటిని తర్వాత నిర్వీర్యం చేశారు. అదే కారులో కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!