Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Mother: మధ్యప్రదేశ్లో దారుణం జరగింది. కనిపెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమర్చాడు కన్నకొడుకు. తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో రాష్ట్రంలోని రత్నా జిల్లాలో కసాయ కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని కొట్టి చంపి చెట్టుకు ఉరేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న శరవణ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Read Also: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
Also Read
కొడుకు ఆశారాం, తన తల్లి జీవాబాయి(65)ని అర్థరాత్రి హత్య చేసినట్లు బాధితురాలి భర్త మాలియా భీల్ శరవణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నీలం చోఘడ్ విలేకరులకు తెలిపారు. రాత్రి భోజనం వడ్డించే విషయంలో తల్లితో కొడుకు ఆశారం గొడవపడినట్లు తేలిందని తెలిపారు. తండ్రి జోక్యం చేసుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత మళ్లీ వచ్చి కర్రలతో కొట్టి, ఇటుకతో మోది తల్లిని హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి నిద్రిస్తున్నట్లు అధికారి తెలిపారు.
ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు తల్లి మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందనే కుట్రను ముందుకు తెచ్చాడు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించామని, నిందితుడి కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!