Loganayagi Case: క్రైమ్ కథా చిత్రం.. ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్తో కలిసి ప్రేయసి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Relationship: తమిళనాడులో మహిళ హత్య ఘటన సంచలనంగా మారింది. మహిళతో సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక వ్యక్తి, తన ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్తో కలిసి విషం ఇచ్చి, ఆ తర్వాత లోయలోకి తోసి హత్య చేశారు. రాష్ట్రంలోని సేలం జిల్లాలోని లోయలో 35 ఏళ్ల మృతదేహం కనుగొన్నారు. మృతురాలిని 35 ఏళ్ల లోగనాయగిగా గుర్తించారు. ఆమె ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి హత్య చేసి, 30 అడుగుల లోయలోకి పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని అనుకున్నారు. చివరకు పోలీసులకు ముగ్గురు చిక్కారు.
ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పనిచేస్తూ హాస్టల్లో నివసిస్తున్న లోగనాయగి మార్చి 1 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం తర్వాత పోలీసులు ఎంక్వైరీలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో చివరిసారిగా 22 ఏళ్ల అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి మాట్లాడినట్లు తేలింది. విచారించగా, లోగనాయకితో అబ్దుల్ సంబంధం బయటపడింది. ఇతడిని కలిసేందుకు ఆమె యెర్కాడ్కి వెళ్లినట్లు తేలింది.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Uttam Kumar Reddy: కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష..
అబ్దుల్, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు ఐటీ ఉద్యోగి అయిన తవియ సుల్తానా(22), నర్సింగ్ విద్యార్థిని మోనిషా(21)తో కలిసి లోగనాయకిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. లోగనాయగి అబ్దుల్తో విడిపోవడానికి ఇష్టపడలేదని, ఇస్లాం మతంలోకి మారి తన పేరును అల్బియాగా మార్చుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తేలింది. అయితే, అబ్దుల్కి అప్పటికే తావియా, మోనిషాలతో సంబంధం ఉంది.
పోలీసులు నివేదిక ప్రకారం.. ముగ్గురూ మాట్లాడుకుందామని లోగనాయగిని కలిశారు. ఆ తర్వాత ఆమెకు విషాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే, వారు ఆమెను లోయలోకి విసిరి, ఆ నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. నిందితులు అబ్దుల్, తవియా, మోనిషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!