Pregnant Woman Attaked: నిండు గర్భిణి దారుణహత్య.. ఆ కక్షతోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Attacked On Pregnant Woman With Sickle In Hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. ఆడపడుచు భర్తే వేటకొడవలితో ఆమెను అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. తన మీద భార్య కేసు పెట్టడానికి కారణం వాళ్లేనని కక్ష పెంచుకొని, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ కిరాతకుడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరంకు చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్లో ఉంటున్నాడు. 2020లో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి.. తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మి ప్రసన్నకు శ్రీరామకృష్ణతో వివాహం జరిపించాడు. కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి.
అదనపు కట్నం తీసుకురావాలంటూ లక్ష్మీ ప్రసన్నను శ్రీ రామకృష్ణ శారీరకంగా, మానసికంగా వేధించాడు. అతని వేధింపులు తాళలేక, భర్త తనని వేధిస్తున్న విషయాన్ని ఆమె పెద్దలకు తెలియజేసింది. దీంతో.. గతేడాది పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అప్పుడు తాను మారుతానని శ్రీరామకృష్ణ చెప్పాడు. మొదట్లో కొన్ని రోజులు మారినట్టుగానే నటించాడు కానీ, మళ్లీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇక సహించేదే లేదని.. శ్రీరామకృష్ణపై భార్య లక్ష్మీ ప్రసన్న చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే.. తన భార్యతో ఇదంతా వెంకట్ రామకృష్ణ దంపతులే చేయిస్తున్నారని వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. ముఖ్యంగా.. వెంకట్ రామకృష్ణపై పగ పెంచుకున్న శ్రీరామకృష్ణ, అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. ఎర్రగడ్డలో వేడకొడవలి కొన్నాడు.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
ఈనెల 6వ తేదీన శ్రీరామకృష్ణ ఆ వేటకొడవలి తీసుకొని, కొండాపూర్లో ఉంటోన్న బామ్మర్ది ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన కుమార్తెను స్కూలు నుంచి తీసుకురావడానికి వెంకట్ రామకృష్ణ బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి.. శ్రీరామకృష్ణ చేతిలో ఉన్న వేటకొడవలిని చూసి, కేకలు వేస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. శ్రీరామకృష్ణ ఆమెపై దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన స్రవంతిని ఆసుపత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి 11 గంటలకు చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!