Doctor Suicide: ‘‘పోలీస్ నన్ను 4 సార్లు రేప్ చేశాడు’’.. సంచలనంగా మారిన వైద్యురాలి ఆత్మహత్య..
- మహారాష్ట్రలో సంచలనంగా వైద్యురాలి ఆత్మహత్య..
- అరచేతిపై సూసైడ్ నోట్..
- ఎస్ఐ తనపై అత్యాచారం చేశాడని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor Suicide: మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఎస్ఐ బడ్నేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
“పోలీస్ ఇన్స్పెక్టర్ గోపాల్ బడ్నే నా మరణానికి కారణం. అతను నన్ను నాలుగుసార్లు అత్యాచారం చేశాడు. అతను ఐదు నెలలకు పైగా నన్ను అత్యాచారం, మానసికంగా మరియు శారీరకంగా హింసించాడు” అని నోట్లో పేర్కొంది. ఫల్తాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలు, జూన్ 19న ఇదే ఆరోపణలతో డీఎస్పీకి లేఖ రాసింది. ఆమె ఆత్మహత్యకు నెలల ముందు డీఎస్పీకి రాసిన లేఖలో.. రూరల్ పోలీస్ విభాగానికి చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధించారని ఆరోపించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె లేఖలో బడ్నే, సబ్-డివిజనల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ లాడ్పుత్రేల పేర్లను పేర్కొంది. తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, ఈ విషయాన్ని దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు బడ్నేను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ లీడర్ విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో వైద్యురాలు ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహాయుతి ప్రభుత్వం పదేపదే పోలీసుల్ని కాపాడుతోందని, ఇది పోలీస్ దురాగతాలకు కారణమవుతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం వైద్యురాలి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!